చిత్తూరు జిల్లా తిరుమల బాలాజీ నగర్కు చెందిన శశికళ ఆరేళ్ల చిన్నారి నీటి తొట్టెలో పడి మరణించింది. రామచంద్రాపురం మండలం, నెత్తకుప్పానికి చెందిన భానుప్రకాష్, జయంతి దంపతులు తిరుమలలో వ్యాపారం చేసుకొని జీవిస్తుంటారు. భానుప్రకాష్ వ్యాపార నిమిత్తం దుకాణానికి వెళ్లారు. తల్లి వంట చేస్తోంది. ఇదే సమయంలో ఆడుకుంటున్న వారి కుమార్తె శశికళ నీటి తొట్టిలో పడింది. కొంత సమయానికి గమనించిన తల్లి జయంతి... పాపను వెంటనే అశ్వని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీచూడండి: తీర్పు అనుకూలంగా రాలేదని న్యాయవాదిపై దాడి