వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం భీమారం గ్రామానికి చెందిన భిక్షపతి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి హసన్పర్తి మండలంలోని కొమిటిపల్లి, ఉనికిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్య రైల్వేలైన్ దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు.
చికిత్స నిమిత్తం అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన రైల్వే ఎస్సై జితేందర్... ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా