నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన చాకటి శ్రీకాంత్ (32) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. డిచ్పల్లి, నిజామాబాద్ రహదారిపై తిరుమల నర్సింగ్ కాలేజి ఎదుట శనివారం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పడంతో శ్రీకాంత్ కింద పడ్డాడు. తలకు బలమైన గాయం అవడంతో వెంటనే ప్రాణాలొదిలాడు. మృతుడు శ్రీకాంత్కు భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి ఎస్ఐ తెలిపారు.
ఇదీ చూడండి: సరదాగా వచ్చారు... అనంత లోకాలకు వెళ్లారు