ETV Bharat / jagte-raho

బైక్ అదుపు తప్పి.. అనంతలోకాలకు పయనం

author img

By

Published : Oct 19, 2020, 5:43 AM IST

డిచ్​పల్లి- నిజామాబాద్ రహదారిపై తిరుమల నర్సింగ్ కాలేజి ఎదుట బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో ధర్మారం(బీ) గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

a man died at thirumala narsing college and he belongs to dharmaram b village
బైక్ అదుపు తప్పి.. అనంతలోకాలకు పయనం

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల పరిధిలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన చాకటి శ్రీకాంత్ (32) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. డిచ్​పల్లి, నిజామాబాద్ రహదారిపై తిరుమల నర్సింగ్ కాలేజి ఎదుట శనివారం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పడంతో శ్రీకాంత్ కింద పడ్డాడు. తలకు బలమైన గాయం అవడంతో వెంటనే ప్రాణాలొదిలాడు. మృతుడు శ్రీకాంత్​కు భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్​పల్లి ఎస్​ఐ తెలిపారు.

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల పరిధిలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన చాకటి శ్రీకాంత్ (32) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. డిచ్​పల్లి, నిజామాబాద్ రహదారిపై తిరుమల నర్సింగ్ కాలేజి ఎదుట శనివారం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పడంతో శ్రీకాంత్ కింద పడ్డాడు. తలకు బలమైన గాయం అవడంతో వెంటనే ప్రాణాలొదిలాడు. మృతుడు శ్రీకాంత్​కు భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్​పల్లి ఎస్​ఐ తెలిపారు.

ఇదీ చూడండి: సరదాగా వచ్చారు... అనంత లోకాలకు వెళ్లారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.