ETV Bharat / jagte-raho

​ బెట్టింగ్​ వేశారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు!

author img

By

Published : Nov 11, 2020, 5:36 PM IST

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఏపీలోని గుంటూరు జిల్లాలో సురేశ్ అనే యువకుడి ఆత్మహత్యకు దారితీసింది. బెట్టింగుల్లో నష్టపోయిన మరో యువకుడు ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు రాగా.. పురుగుల మందు తాగినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

a man commited to suicide in guntur district due to cricket betting loss
డబ్బుపై ఆశతో క్రికెట్​ బెట్టింగ్​ వేశారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు!

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అమితమైన వినోదం పంచింది. అదే సమయంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు కొందరి జీవితాల్ని బలితీసుకుంటున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లాలో బెట్టింగ్​లలో డబ్బులు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించటం... వారిలో ఒకరు మరణించటం తీవ్ర విషాదం నింపింది. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన సురేశ్​, బెల్లంకొండ మండలం బుడగజంగాల కాలనీకి చెందిన కుమార్ ఇద్దరూ వరుసకు సోదరులు అవుతారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ వారిని ఈ ఊబిలోకి దించింది.

అయితే బెట్టింగుల్లో 2 లక్షల మేర నష్టపోయారు. ఆ డబ్బులు ఇవ్వాలని బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఇంట్లో తెలిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో ఇద్దరూ శీతలపానీయంలో పురుగుల మందు కలిపి ఆత్మహత్యకు యత్నించారు. దీనికి సంబంధించి సెల్ఫీ వీడియోను బంధువులకు వాట్సప్​లో పంపించారు. వెంటనే బంధువులు అప్రమత్తమై ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే సురేశ్​ మరణించగా... కుమార్ మాత్రం జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు.

ప్రాణం మీదకు తెచ్చిన బెట్టింగ్

యువకులు ఆత్మహత్యకు యత్నించిన ప్రాంతం బెల్లంకొండ పరిధిలోకి వస్తుంది. దీంతో బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు బెట్టింగ్ వ్యవహారం కారణమని తేలితే నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతానికి కుమార్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డప్పటికీ మాట్లడే పరిస్థితిలో లేడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ప్రియుడి కిడ్నాప్‌కు ప్రియురాలు యత్నం.. యువకుడి తండ్రి మృతి

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అమితమైన వినోదం పంచింది. అదే సమయంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు కొందరి జీవితాల్ని బలితీసుకుంటున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లాలో బెట్టింగ్​లలో డబ్బులు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించటం... వారిలో ఒకరు మరణించటం తీవ్ర విషాదం నింపింది. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన సురేశ్​, బెల్లంకొండ మండలం బుడగజంగాల కాలనీకి చెందిన కుమార్ ఇద్దరూ వరుసకు సోదరులు అవుతారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ వారిని ఈ ఊబిలోకి దించింది.

అయితే బెట్టింగుల్లో 2 లక్షల మేర నష్టపోయారు. ఆ డబ్బులు ఇవ్వాలని బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఇంట్లో తెలిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో ఇద్దరూ శీతలపానీయంలో పురుగుల మందు కలిపి ఆత్మహత్యకు యత్నించారు. దీనికి సంబంధించి సెల్ఫీ వీడియోను బంధువులకు వాట్సప్​లో పంపించారు. వెంటనే బంధువులు అప్రమత్తమై ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే సురేశ్​ మరణించగా... కుమార్ మాత్రం జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు.

ప్రాణం మీదకు తెచ్చిన బెట్టింగ్

యువకులు ఆత్మహత్యకు యత్నించిన ప్రాంతం బెల్లంకొండ పరిధిలోకి వస్తుంది. దీంతో బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు బెట్టింగ్ వ్యవహారం కారణమని తేలితే నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతానికి కుమార్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డప్పటికీ మాట్లడే పరిస్థితిలో లేడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ప్రియుడి కిడ్నాప్‌కు ప్రియురాలు యత్నం.. యువకుడి తండ్రి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.