ETV Bharat / jagte-raho

కత్తితో పొడిచి తండ్రిని హత్య చేసిన కుమారుడు

డబ్బులు విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కాస్త చివరకు ఆ తండ్రి హత్యకు దారి తీసింది. ఈ అమానవీయ ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది.

author img

By

Published : Dec 10, 2020, 11:47 AM IST

కత్తితో పొడిచి తండ్రిని హత్య చేసిన కుమారుడు
కత్తితో పొడిచి తండ్రిని హత్య చేసిన కుమారుడు

ఏపీలోని కడప జిల్లా రవీంద్రనగర్​లో విషాదం చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో తండ్రి హత్యకు గురయ్యాడు. రవీంద్రనగర్​కు చెందిన సయ్యద్ కాసిం సాహెబ్​కు నలుగురు సంతానం. 2వ కుమారుడు ముబారక్.. జులాయిగా తిరుగుతున్నాడు. అయితే తండ్రి కాసిం సాహెబ్ ఇటీవల ఓ స్థలాన్ని విక్రయించాడు.

దానికి సంబంధించి డబ్బు విషయంలో ముబారక్, సాహెబ్​ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ముబారక్ పక్కనే ఉన్న కత్తితో తండ్రి కడుపులో పొడవగా.. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాహెబ్​ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప పోలీసులు వివరించారు.

ఏపీలోని కడప జిల్లా రవీంద్రనగర్​లో విషాదం చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో తండ్రి హత్యకు గురయ్యాడు. రవీంద్రనగర్​కు చెందిన సయ్యద్ కాసిం సాహెబ్​కు నలుగురు సంతానం. 2వ కుమారుడు ముబారక్.. జులాయిగా తిరుగుతున్నాడు. అయితే తండ్రి కాసిం సాహెబ్ ఇటీవల ఓ స్థలాన్ని విక్రయించాడు.

దానికి సంబంధించి డబ్బు విషయంలో ముబారక్, సాహెబ్​ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ముబారక్ పక్కనే ఉన్న కత్తితో తండ్రి కడుపులో పొడవగా.. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాహెబ్​ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి: ఆగి ఉన్న కారులో మృతదేహం.. ఆధార్​తో మృతుడి గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.