ETV Bharat / international

లాడ్​ నగరంలో అత్యయిక స్థితిని ప్రకటించిన నెతన్యాహు - ఇజ్రాయెల్​ పాలస్తీనా దాడులు

ఇజ్రాయెల్​లోని లాడ్​ నగరంలో ఎమర్జెన్సీని ప్రకటించారు ఆ దేశ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు. మిలిటెంట్లపై పోరాటం కొనసాగుతుందని.. మిషన్​ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్​- పాలస్తీనా ఘర్షణలపై భారత్​ సహా అమెరికా, జపాన్​లు ఆందోళన వ్యక్తం చేశాయి. దాడులను తక్షణమే విరమించుకోవాలని కోరాయి.

emergency in Israel, Israel and Palestine conflict
ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు
author img

By

Published : May 12, 2021, 9:24 AM IST

ఇజ్రాయెల్​-పాలస్తీనా ఘర్షణల నేపథ్యంలో అట్టుడుకుతున్న లాడ్​ నగరంలో అత్యయిక స్థితిని ప్రకటించారు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు. 1966లో ఇజ్రాయెల్​లోని అరబ్​లపై సైనిక పాలన రద్దు అయిన తర్వాత వారిపై ఇలా అత్యయిక స్థితిని ప్రయోగించడం ఇదే తొలిసారి. ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం నెతన్యాహు మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

emergency in Israel, Israel and Palestine conflict
గాజాలో దాడులు
emergency in Israel, Israel and Palestine conflict
రాకెట్​ దాడులు

లాడ్​ నగరంలో ప్రధాని నెతన్యాహు బుధవారం పర్యటించనున్నట్లు సమాచారం. నగరంలో దాడుల కారణంగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

ప్రధాని హెచ్చరిక..

"మిలిటెంట్ల దాడులను సైన్యం దీటుగా ఎదుర్కొంది. అయితే ఈ పోరాటం మరికొంత కాలం కొనసాగుతుంది. హమాస్​, ఇస్లామిక్​ జిహాద్​ తగిన మూల్యం చెల్లించుకున్నాయి. మరింత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మిలిటెంట్లను కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రతిదాడులు కొనసాగుతాయి. మిషన్​ పూర్తి కావడానికి సమయం పడుతుంది"

-బెంజమిన్​ నెతన్యాహు, ఇజ్రాయెల్​ ప్రధాని

పెరిగిన మృతుల సంఖ్య..

గాజాపై ఇజ్రాయెల్​ జరుపుతున్న దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 32కి చేరింది. వైమానిక దాడులకు 220 మంది గాయపడ్డారు. ఈ విషయాలను స్థానిక మీడియా వెల్లడించింది.

emergency in Israel, Israel and Palestine conflict
రాకెట్​ దాడులకు ఇల్లు ధ్వంసం
emergency in Israel, Israel and Palestine conflict
రాకెట్​ దాడులు
emergency in Israel, Israel and Palestine conflict
ధ్వంసమైన వాహనాలు

విదేశాల ఆందోళన..

ఇజ్రాయెల్​ పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల పట్ల భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు తక్షణం దాడులను నిలిపివేయాలని కోరింది. రాకెట్ దాడులను ఖండించిన భారత్​.. శాంతి చర్చలకు సిద్ధం కావాలని సూచించింది. అమెరికా, జపాన్​ దేశాలు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి : ఇజ్రాయెల్​-పాలస్తీనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు!

ఇజ్రాయెల్​-పాలస్తీనా ఘర్షణల నేపథ్యంలో అట్టుడుకుతున్న లాడ్​ నగరంలో అత్యయిక స్థితిని ప్రకటించారు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు. 1966లో ఇజ్రాయెల్​లోని అరబ్​లపై సైనిక పాలన రద్దు అయిన తర్వాత వారిపై ఇలా అత్యయిక స్థితిని ప్రయోగించడం ఇదే తొలిసారి. ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం నెతన్యాహు మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

emergency in Israel, Israel and Palestine conflict
గాజాలో దాడులు
emergency in Israel, Israel and Palestine conflict
రాకెట్​ దాడులు

లాడ్​ నగరంలో ప్రధాని నెతన్యాహు బుధవారం పర్యటించనున్నట్లు సమాచారం. నగరంలో దాడుల కారణంగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

ప్రధాని హెచ్చరిక..

"మిలిటెంట్ల దాడులను సైన్యం దీటుగా ఎదుర్కొంది. అయితే ఈ పోరాటం మరికొంత కాలం కొనసాగుతుంది. హమాస్​, ఇస్లామిక్​ జిహాద్​ తగిన మూల్యం చెల్లించుకున్నాయి. మరింత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మిలిటెంట్లను కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రతిదాడులు కొనసాగుతాయి. మిషన్​ పూర్తి కావడానికి సమయం పడుతుంది"

-బెంజమిన్​ నెతన్యాహు, ఇజ్రాయెల్​ ప్రధాని

పెరిగిన మృతుల సంఖ్య..

గాజాపై ఇజ్రాయెల్​ జరుపుతున్న దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 32కి చేరింది. వైమానిక దాడులకు 220 మంది గాయపడ్డారు. ఈ విషయాలను స్థానిక మీడియా వెల్లడించింది.

emergency in Israel, Israel and Palestine conflict
రాకెట్​ దాడులకు ఇల్లు ధ్వంసం
emergency in Israel, Israel and Palestine conflict
రాకెట్​ దాడులు
emergency in Israel, Israel and Palestine conflict
ధ్వంసమైన వాహనాలు

విదేశాల ఆందోళన..

ఇజ్రాయెల్​ పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల పట్ల భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు తక్షణం దాడులను నిలిపివేయాలని కోరింది. రాకెట్ దాడులను ఖండించిన భారత్​.. శాంతి చర్చలకు సిద్ధం కావాలని సూచించింది. అమెరికా, జపాన్​ దేశాలు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి : ఇజ్రాయెల్​-పాలస్తీనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.