ETV Bharat / international

ఉగ్రసంస్థలతో ఆ అధ్యక్షుడికి సన్నిహిత సంబంధాలు

author img

By

Published : Oct 17, 2020, 9:48 PM IST

సిరియా ఉగ్రసంస్థలతో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్​ ఎర్డోగాన్​కు సన్నిహిత సంబంధాలున్నట్లు పలు నివేదికలు ధ్రువీకరించాయి. ప్రధానంగా ఐసిస్.. ఉగ్రవాదులతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. సిరియా, ఇరాక్​ల నుంచి దొంగిలించిన చమురు కొనుగోళ్లు కూడా ఉగ్రసంస్థలు జరిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Erdogan has close links with terrorist organisations: Swedish Nordic Monitor
ఉగ్రసంస్థలతో టర్కీ అధ్యక్షుడికి సన్నిహిత సంబంధాలు

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్​ ఎర్డోగాన్​కు సిరియా ఉగ్రసంస్థలతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆధారాలను బహిర్గతం చేసింది స్వీడన్​కు చెందిన నొర్డిక్ మానిటర్ వార్తా సంస్ధ. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్​సైట్లో వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులను ఓడించి తన లక్ష్యాలు, ఎజెండాలను సాధించేందుకు ఐసిస్​ సంస్థతో టర్కీ అధ్యక్షుడు సంబంధాలు ఏర్పరచుకున్నారని నోర్డిక్​ నివేదిక పేర్కొంది.

"తన రాజకీయ ప్రత్యర్థి ఫెతుల్లా గులెన్​పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐసిస్ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదిర్​ మషారిపోవ్​ను ఎర్డోగాన్​ ప్రభుత్వం నియమించింది. 2017లో టర్కీలో మారణహోమం సృష్టించి 39 మందిని హతమార్చింది ఆ ఉగ్రవాదే." అని వెబ్​సైట్లోని నివేదికను ఆధారంగా చూపింది సనా న్యూస్​.

ఎర్డోగాన్​కు సిరియా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు మరికొన్ని సంస్థలు కూడా ఆధారాలు చూపాయి. పలు వాణిజ్య ఒప్పందాలు సహా సిరియా ఇరాక్​ నుంచి దొంగిలించిన చమురు కొనుగోళ్లలో ఐసిస్​ జోక్యం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ఎర్డోగాన్ చర్యల వల్ల ఉగ్రవాదులకు టర్కీ కీలక స్థావరంగా మారిందని నివేదికలు పేర్కొన్నాయి. నేరాలకు పాల్పడే వీరికి నిధులు, సహకారం, శిక్షణ ఇక్కడే అందుతున్నాయని తెలిపాయి.

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్​ ఎర్డోగాన్​కు సిరియా ఉగ్రసంస్థలతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆధారాలను బహిర్గతం చేసింది స్వీడన్​కు చెందిన నొర్డిక్ మానిటర్ వార్తా సంస్ధ. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్​సైట్లో వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులను ఓడించి తన లక్ష్యాలు, ఎజెండాలను సాధించేందుకు ఐసిస్​ సంస్థతో టర్కీ అధ్యక్షుడు సంబంధాలు ఏర్పరచుకున్నారని నోర్డిక్​ నివేదిక పేర్కొంది.

"తన రాజకీయ ప్రత్యర్థి ఫెతుల్లా గులెన్​పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐసిస్ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదిర్​ మషారిపోవ్​ను ఎర్డోగాన్​ ప్రభుత్వం నియమించింది. 2017లో టర్కీలో మారణహోమం సృష్టించి 39 మందిని హతమార్చింది ఆ ఉగ్రవాదే." అని వెబ్​సైట్లోని నివేదికను ఆధారంగా చూపింది సనా న్యూస్​.

ఎర్డోగాన్​కు సిరియా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు మరికొన్ని సంస్థలు కూడా ఆధారాలు చూపాయి. పలు వాణిజ్య ఒప్పందాలు సహా సిరియా ఇరాక్​ నుంచి దొంగిలించిన చమురు కొనుగోళ్లలో ఐసిస్​ జోక్యం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ఎర్డోగాన్ చర్యల వల్ల ఉగ్రవాదులకు టర్కీ కీలక స్థావరంగా మారిందని నివేదికలు పేర్కొన్నాయి. నేరాలకు పాల్పడే వీరికి నిధులు, సహకారం, శిక్షణ ఇక్కడే అందుతున్నాయని తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.