ETV Bharat / international

'ఆ టీకాల కోసం భారత్​తో చర్చిస్తున్నాం'

author img

By

Published : Jun 19, 2021, 12:30 PM IST

కొవిడ్​ టీకా డోసులను అత్యవసరంగా పొందేందుకు తాము ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సహా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. టీకాల ఎగుమతిని భారత్​ నిలిపివేయగా.. వివిధ దేశాలు వ్యాక్సిన్​ రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పింది.

who, astrazeneca, sii, who
ఆస్ట్రాజెనెకా టీకా

వ్యాక్సిన్​ ఎగుమతులను భారత్​ నిలిపివేయగా వివిధ దేశాలు.. టీకా రెండో డోసు దొరక్క ఇబ్బంది పడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సహా భారత ప్రభుత్వంతో అత్యవసరంగా సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

"టీకా రెండో డోసు వేయకుండా మిగిలిపోయిన దేశాలెన్నో ఉన్నాయి. 30నుంచి 40కు పైగా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, వారు ఆ టీకాలను మాకు అందించటం లేదు. ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సహా భారత ప్రభుత్వంతో ఈ టీకాలను అత్యంత వేగంగా మళ్లీ సరఫరా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాం."

-బ్రూస్​ ఐల్వార్డ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ సలహాదారు.

భారత్​ పొరుగుదేశాలైన నేపాల్​, శ్రీలంక సహా మరెన్నో దేశాలు.. కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నాయని ఐల్వార్డ్​ తెలిపారు. తాము ఈ దేశాలకు వ్యాక్సిన్​ డోసులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

జూన్​ నెల ప్రారంభంలో తాము 8 కోట్ల టీకా డోసులను వివిధ దేశాలకు సరఫరా చేశామని ఐల్వార్డ్​ తెలిపారు. అన్ని దేశాలకు టీకా పంపిణీని సమానంగా చేపట్టేందుకు తమకు మరో 20 కోట్ల టీకా డోసులు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే.. కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావంతో భారత్​తో పాటు వివిధ దేశాల నుంచి తమకు టీకా సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.

ఇదీ చూడండి: Bharat Biotech: 'కొవాగ్జిన్‌'పై 23న డబ్ల్యూహెచ్‌ఓ భేటీ

ఇదీ చూడండి: 'డెల్టా' వేరియంట్​తో మానవాళికి పెను ముప్పు తప్పదా?

వ్యాక్సిన్​ ఎగుమతులను భారత్​ నిలిపివేయగా వివిధ దేశాలు.. టీకా రెండో డోసు దొరక్క ఇబ్బంది పడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సహా భారత ప్రభుత్వంతో అత్యవసరంగా సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

"టీకా రెండో డోసు వేయకుండా మిగిలిపోయిన దేశాలెన్నో ఉన్నాయి. 30నుంచి 40కు పైగా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, వారు ఆ టీకాలను మాకు అందించటం లేదు. ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సహా భారత ప్రభుత్వంతో ఈ టీకాలను అత్యంత వేగంగా మళ్లీ సరఫరా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాం."

-బ్రూస్​ ఐల్వార్డ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ సలహాదారు.

భారత్​ పొరుగుదేశాలైన నేపాల్​, శ్రీలంక సహా మరెన్నో దేశాలు.. కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నాయని ఐల్వార్డ్​ తెలిపారు. తాము ఈ దేశాలకు వ్యాక్సిన్​ డోసులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

జూన్​ నెల ప్రారంభంలో తాము 8 కోట్ల టీకా డోసులను వివిధ దేశాలకు సరఫరా చేశామని ఐల్వార్డ్​ తెలిపారు. అన్ని దేశాలకు టీకా పంపిణీని సమానంగా చేపట్టేందుకు తమకు మరో 20 కోట్ల టీకా డోసులు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే.. కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావంతో భారత్​తో పాటు వివిధ దేశాల నుంచి తమకు టీకా సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.

ఇదీ చూడండి: Bharat Biotech: 'కొవాగ్జిన్‌'పై 23న డబ్ల్యూహెచ్‌ఓ భేటీ

ఇదీ చూడండి: 'డెల్టా' వేరియంట్​తో మానవాళికి పెను ముప్పు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.