ETV Bharat / international

బ్రిటన్ స్టూడెంట్​ వీసాకు కొత్త నిబంధనలు - విదేశీ విద్యార్థుల వీసాల్లో మార్పులు చేసిన బ్రిటన్​

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియకు నూతన నిబంధనలు తీసుకొచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. కొత్తగా పాయింట్ల ఆధారంగా వీసా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 70 పాయింట్లు ఉంటేనే బ్రిటన్ స్టూడెంట్ వీసా లభిస్తుంది.

uk change student vis norms
స్టూడెంట్ విసాలో బ్రిటన్ మార్పులు
author img

By

Published : Sep 11, 2020, 5:27 AM IST

విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసా నిబంధనల్లో బ్రిటన్ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న టైర్ 4 వీసా వ్యవస్థ స్థానంలో కొత్తగా పాయింట్ల ఆధారిత విధానాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుంచి కొత్త విధానం ప్రారంభమవనున్నట్లు బ్రిటన్ హై కమిషన్ (బీహెచ్​సీ) ప్రకటించింది.

బీహెచ్​సీ ప్రకారం.. విదేశీ విద్యార్థులు బ్రిటన్ వీసా పొందాలంటే 70 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.

కొత్త పద్ధతిలో వీసా పొందాలంటే..

ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఆఫర్​ లేటర్, ఇంగ్లీష్​లో మాట్లాడటం, బ్రిటన్​లో చదువుకునే రోజుల్లో వారిని వారు పోషించుకునే సామర్థ్యం ఉంటే.. వీసాకు కావాల్సిన పాయింట్లను సాధించొచ్చు అని బీహెచ్​సీ తెలిపింది. విద్యార్థులు కోర్సు ప్రారంభమయ్యే 6 నెలల ముందే వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఇంతకు ముందు టైర్ 4 విధానంలో ఇది మూడు నెలలుగా ఉండటం గమనార్హం.

తమ దేశంలో ఎక్కువగా చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో.. భారతీయులు కూడా ఒకరని బ్రిటన్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 50,000 మంది భారతీయ విద్యార్థులకు.. స్టూడెంట్​ వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో చాలా మంది విదేశీ విద్యార్థులు తమ కోర్సుల్లో జాయిన్ అయ్యే ప్రణాళికను.. 2021కి వాయిదా వేసుకుంటున్నట్లు తెలిసిందని బ్రిటన్ పేర్కొంది.

ఇదీ చూడండి:'ట్రంప్ కష్టానికి ఫలితమే‌ 'నోబెల్'​ నామినేషన్​'

విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసా నిబంధనల్లో బ్రిటన్ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న టైర్ 4 వీసా వ్యవస్థ స్థానంలో కొత్తగా పాయింట్ల ఆధారిత విధానాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుంచి కొత్త విధానం ప్రారంభమవనున్నట్లు బ్రిటన్ హై కమిషన్ (బీహెచ్​సీ) ప్రకటించింది.

బీహెచ్​సీ ప్రకారం.. విదేశీ విద్యార్థులు బ్రిటన్ వీసా పొందాలంటే 70 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.

కొత్త పద్ధతిలో వీసా పొందాలంటే..

ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఆఫర్​ లేటర్, ఇంగ్లీష్​లో మాట్లాడటం, బ్రిటన్​లో చదువుకునే రోజుల్లో వారిని వారు పోషించుకునే సామర్థ్యం ఉంటే.. వీసాకు కావాల్సిన పాయింట్లను సాధించొచ్చు అని బీహెచ్​సీ తెలిపింది. విద్యార్థులు కోర్సు ప్రారంభమయ్యే 6 నెలల ముందే వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఇంతకు ముందు టైర్ 4 విధానంలో ఇది మూడు నెలలుగా ఉండటం గమనార్హం.

తమ దేశంలో ఎక్కువగా చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో.. భారతీయులు కూడా ఒకరని బ్రిటన్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 50,000 మంది భారతీయ విద్యార్థులకు.. స్టూడెంట్​ వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో చాలా మంది విదేశీ విద్యార్థులు తమ కోర్సుల్లో జాయిన్ అయ్యే ప్రణాళికను.. 2021కి వాయిదా వేసుకుంటున్నట్లు తెలిసిందని బ్రిటన్ పేర్కొంది.

ఇదీ చూడండి:'ట్రంప్ కష్టానికి ఫలితమే‌ 'నోబెల్'​ నామినేషన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.