ETV Bharat / international

'రెండు డోసులతో 'ఆస్ట్రాజెనెకా' సామర్థ్యం 90శాతం'

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ రెండు డోసుల సమర్థత 85-90 శాతంగా ఉందని ఇంగ్లాండ్​ ప్రజా ఆరోగ్య విభాగం ప్రకటించింది. 60 ఏళ్లపైబడిన వారిలో సుమారు 13వేల మరణాలను నిరోధించిందని పేర్కొంది. ఈ మేరకు వ్యాక్సిన్​ తీసుకున్న వారిపై అధ్యయనం చేసి వారం నివేదికను విడుదల చేసింది.

author img

By

Published : May 21, 2021, 12:23 PM IST

AstraZeneca
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్న తర్వాత 85-90 శాతం సమర్థత కనబరిచినట్లు ఇంగ్లాండ్​ ప్రజా ఆరోగ్య విభాగం (పీహెచ్​ఈ)ప్రకటించింది. యూకేలో వ్యాక్సిన్​ తీసుకున్న వారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.

ఈ మేరకు కరోనా టీకా సమర్థతపై తాజాగా వారం నివేదకను విడుదల చేసింది. 2021, మే 9 వరకు 60 ఏళ్లుపైబడిన వారిలో 13,000 మరణాలు, 39,100 మంది ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించినట్లు అంచనా వేసింది. పీహెచ్​ఈ డేటాపై కీలక వ్యాఖ్యలు చేశారు యూకే ఆరోగ్య, సామాజిక భద్రత మంత్రి మాట్​ హాన్కాక్​.

"కొత్త గణాంకాల ప్రకారం వ్యాక్సిన్​ ప్రజల ప్రాణాలను రక్షిస్తుందని తేలింది. కొవిడ్​-19తో ఆసుపత్రుల్లో గడిపే సమయాన్నీ తగ్గిస్తోంది. 13వేల మరణాలు, 39,100ల మంది ఆసుపత్రుల్లో చేరటాన్ని నిరోధించింది. టీకా ప్రభావం ఎంత మేర ఉందో ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. వైరస్​ కొత్త వేరియంట్ల ముప్పుతో టీకా తీసుకోవటం కన్నా గొప్పది ఇంకోటి లేదు."

- మాట్​ హాన్కాక్​, యూకే ఆరోగ్య, సామాజిక భద్రత మంత్రి.

ఆక్స్​ఫర్డ్​, ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు తీసుకోవటం ద్వారా 90 శాతం సమర్థత కనబరిచినట్లు యూకే వ్యాక్సిన్​ మినిస్టర్​ నధిమ్​ జహావి పేర్కొన్నారు. ప్రాణాలు రక్షించే వ్యాక్సిన్ల కన్నా వైరస్​ను అంతం చేసే మరో ఆయుధం లేదన్నారు. రెండో డోసు తీసుకున్న తర్వాత వైరస్​ను ఎదుర్కొనే శక్తిని పొంది సాధారణ పరిస్థితికి వస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రపంచానికి వ్యాక్సిన్ పంచనున్న అమెరికా!

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్న తర్వాత 85-90 శాతం సమర్థత కనబరిచినట్లు ఇంగ్లాండ్​ ప్రజా ఆరోగ్య విభాగం (పీహెచ్​ఈ)ప్రకటించింది. యూకేలో వ్యాక్సిన్​ తీసుకున్న వారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.

ఈ మేరకు కరోనా టీకా సమర్థతపై తాజాగా వారం నివేదకను విడుదల చేసింది. 2021, మే 9 వరకు 60 ఏళ్లుపైబడిన వారిలో 13,000 మరణాలు, 39,100 మంది ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించినట్లు అంచనా వేసింది. పీహెచ్​ఈ డేటాపై కీలక వ్యాఖ్యలు చేశారు యూకే ఆరోగ్య, సామాజిక భద్రత మంత్రి మాట్​ హాన్కాక్​.

"కొత్త గణాంకాల ప్రకారం వ్యాక్సిన్​ ప్రజల ప్రాణాలను రక్షిస్తుందని తేలింది. కొవిడ్​-19తో ఆసుపత్రుల్లో గడిపే సమయాన్నీ తగ్గిస్తోంది. 13వేల మరణాలు, 39,100ల మంది ఆసుపత్రుల్లో చేరటాన్ని నిరోధించింది. టీకా ప్రభావం ఎంత మేర ఉందో ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. వైరస్​ కొత్త వేరియంట్ల ముప్పుతో టీకా తీసుకోవటం కన్నా గొప్పది ఇంకోటి లేదు."

- మాట్​ హాన్కాక్​, యూకే ఆరోగ్య, సామాజిక భద్రత మంత్రి.

ఆక్స్​ఫర్డ్​, ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు తీసుకోవటం ద్వారా 90 శాతం సమర్థత కనబరిచినట్లు యూకే వ్యాక్సిన్​ మినిస్టర్​ నధిమ్​ జహావి పేర్కొన్నారు. ప్రాణాలు రక్షించే వ్యాక్సిన్ల కన్నా వైరస్​ను అంతం చేసే మరో ఆయుధం లేదన్నారు. రెండో డోసు తీసుకున్న తర్వాత వైరస్​ను ఎదుర్కొనే శక్తిని పొంది సాధారణ పరిస్థితికి వస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రపంచానికి వ్యాక్సిన్ పంచనున్న అమెరికా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.