ETV Bharat / international

బ్రెగ్జిట్​ స్మారక చిహ్నంగా నూతన 'నాణెం' విడుదల

author img

By

Published : Jan 27, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 2:33 AM IST

ఐరోపా సమాఖ్య  నుంచి బ్రిటన్​ వైదొలిగే ముందు బ్రెగ్జిట్​  స్మారక చిహ్నంగా ఓ ప్రత్యేక  నాణేన్ని ముద్రించింది యూకే ప్రభుత్వం. జనవరి 31 నుంచి 30 లక్షలకు పైగా నాణేలను అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

brexit
బ్రెగ్జిట్​ స్మారక చిహ్నంగా నూతన నాణెం విడుదల

ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్​ వైదొలిగే ముందు బ్రెగ్జిట్​కు​ ప్రతీకగా ఓ ప్రత్యేక నాణెం విడుదల చేసింది యూకే సర్కారు. శాంతి, శ్రేయస్సు, అన్ని దేశాలతో స్నేహం అనే సందేశంతో కూడిన '50 పెన్స్'​ విలువగల బ్రెగ్జిట్ స్మారక నాణేన్ని రూపొందించింది. బ్రెగ్జిట్ సందర్భంగా జనవరి 31 నుంచి 30లక్షలకు పైగా నాణేలు అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 70లక్షల నాణేలు చెలామణిలోకి రానున్నాయి.

ఈ కొత్త నాణెం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బ్రిటన్​ ఛాన్సులర్​ సజిద్​ జావిద్​.

ఈ నాణేలను పొందటానికి ఇప్పటికే 13వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ముద్రణ సంస్థ రాయల్​ మింట్ తెలిపింది. 2019 అక్టోబర్​ 31కి ముందే ఈ నాణేల తయారీకీ జావిద్​ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత బ్రెగ్జిట్​ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందలేదు. ఫలితంగా ఆనాడే ముద్రించిన 10లక్షల నాణేలన్నింటినీ కరిగించి తాజాగా మరోసారి నూతన నాణేలను తయారు చేసింది ప్రభుత్వం.

ఇదీ చదవండి: విమానాలపై లేజర్​లైట్​... చివరికి అరెస్ట్​!

ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్​ వైదొలిగే ముందు బ్రెగ్జిట్​కు​ ప్రతీకగా ఓ ప్రత్యేక నాణెం విడుదల చేసింది యూకే సర్కారు. శాంతి, శ్రేయస్సు, అన్ని దేశాలతో స్నేహం అనే సందేశంతో కూడిన '50 పెన్స్'​ విలువగల బ్రెగ్జిట్ స్మారక నాణేన్ని రూపొందించింది. బ్రెగ్జిట్ సందర్భంగా జనవరి 31 నుంచి 30లక్షలకు పైగా నాణేలు అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 70లక్షల నాణేలు చెలామణిలోకి రానున్నాయి.

ఈ కొత్త నాణెం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బ్రిటన్​ ఛాన్సులర్​ సజిద్​ జావిద్​.

ఈ నాణేలను పొందటానికి ఇప్పటికే 13వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ముద్రణ సంస్థ రాయల్​ మింట్ తెలిపింది. 2019 అక్టోబర్​ 31కి ముందే ఈ నాణేల తయారీకీ జావిద్​ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత బ్రెగ్జిట్​ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందలేదు. ఫలితంగా ఆనాడే ముద్రించిన 10లక్షల నాణేలన్నింటినీ కరిగించి తాజాగా మరోసారి నూతన నాణేలను తయారు చేసింది ప్రభుత్వం.

ఇదీ చదవండి: విమానాలపై లేజర్​లైట్​... చివరికి అరెస్ట్​!

AP Video Delivery Log - 1700 GMT News
Sunday, 26 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1634: Hong Kong Anniversary Protest AP Clients Only 4251271
Clashes on anniversary of snack stand dispute
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 2:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.