ETV Bharat / international

అమెజాన్​ కార్చిచ్చు: బ్రెజిల్​కు జీ-7 దేశాల అండ

author img

By

Published : Aug 26, 2019, 8:49 AM IST

Updated : Sep 28, 2019, 7:14 AM IST

అమెజాన్ కార్చిచ్చుపై జీ-7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంటలను అదుపు చేసేందుకు బ్రెజిల్​కు ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పటానికి ఒప్పందం సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నాయి.

కార్చిచ్చు విముక్తికి బ్రెజిల్​కు జీ-7 దేశాల అండ
అమెజాన్​ కార్చిచ్చు: బ్రెజిల్​కు జీ-7 దేశాల అండ

అమెజాన్ అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చుపై జీ-7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంటలను అదుపుచేయడానికి బ్రెజిల్​కు సహాయం చేయాలని ముక్తకంఠంతో నిర్ణయించాయి. ఈ మేరకు జీ-7 దేశాల నాయకులు... బ్రెజిల్​కు ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు ఓ ఒప్పందాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ వెల్లడించారు.

'అండగా నిలుస్తాం'

బ్రెజిల్​లో అటవీ పునరుద్ధరణకు జర్మనీ సహా ప్రపంచదేశాలు తోడ్పడతాయని ఆ దేశ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​ పేర్కొన్నారు. కార్చిచ్చును నియంత్రించడానికి బొల్సొనారో తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆమె​ అభిప్రాయపడ్డారు.

పోప్​ ప్రార్థన

తన స్వస్థలమైన అర్జెంటీనాకు పొరుగునే ఉన్న బ్రెజిల్​ అడవుల్లో కార్చిచ్చు చెలరేగడంపై పోప్​ ఫ్రాన్సిస్​ ఆందోళన వ్యక్తం చేశారు. మంటలను వీలైనంత త్వరగా నియంత్రించాలని.. అందుకోసం ప్రజలు ప్రార్థించాలని కోరారు.

'సాయాన్ని అంగీకరిస్తున్నా..'

ప్రపంచదేశాల సహాయాన్ని బ్రెజిల్​ అధ్యక్షుడు స్వాగితించారు. మంటలను అదుపుచేసేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమెన్​ నెతన్యాహు చెప్పినట్టు బొల్సొనారో ట్వీట్​ చేశారు. అలాగే స్పెయిన్​, చిలీ, పెరుగ్వే దేశాల సాయాన్నీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే కార్చిచ్చును అదుపుచేసేందుకు 44 వేల మంది సైనికులను వియోగించినట్లు బొల్సొనారో స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు

అమెజాన్​ కార్చిచ్చు: బ్రెజిల్​కు జీ-7 దేశాల అండ

అమెజాన్ అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చుపై జీ-7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంటలను అదుపుచేయడానికి బ్రెజిల్​కు సహాయం చేయాలని ముక్తకంఠంతో నిర్ణయించాయి. ఈ మేరకు జీ-7 దేశాల నాయకులు... బ్రెజిల్​కు ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు ఓ ఒప్పందాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ వెల్లడించారు.

'అండగా నిలుస్తాం'

బ్రెజిల్​లో అటవీ పునరుద్ధరణకు జర్మనీ సహా ప్రపంచదేశాలు తోడ్పడతాయని ఆ దేశ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​ పేర్కొన్నారు. కార్చిచ్చును నియంత్రించడానికి బొల్సొనారో తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆమె​ అభిప్రాయపడ్డారు.

పోప్​ ప్రార్థన

తన స్వస్థలమైన అర్జెంటీనాకు పొరుగునే ఉన్న బ్రెజిల్​ అడవుల్లో కార్చిచ్చు చెలరేగడంపై పోప్​ ఫ్రాన్సిస్​ ఆందోళన వ్యక్తం చేశారు. మంటలను వీలైనంత త్వరగా నియంత్రించాలని.. అందుకోసం ప్రజలు ప్రార్థించాలని కోరారు.

'సాయాన్ని అంగీకరిస్తున్నా..'

ప్రపంచదేశాల సహాయాన్ని బ్రెజిల్​ అధ్యక్షుడు స్వాగితించారు. మంటలను అదుపుచేసేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమెన్​ నెతన్యాహు చెప్పినట్టు బొల్సొనారో ట్వీట్​ చేశారు. అలాగే స్పెయిన్​, చిలీ, పెరుగ్వే దేశాల సాయాన్నీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే కార్చిచ్చును అదుపుచేసేందుకు 44 వేల మంది సైనికులను వియోగించినట్లు బొల్సొనారో స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.