ETV Bharat / international

బ్రిటన్​కు ఈయూ మూడు రోజుల అల్టిమేటం

author img

By

Published : Dec 18, 2020, 7:35 AM IST

ఐరోపా సమాఖ్యతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు బ్రిటన్​కు మూడు రోజుల గడువుతో అల్టిమేటం జారీ చేసింది ఐరోపా పార్లమెంట్. ఈ ఏడాదిలోనే ఒప్పందం ఆమోదం పొందాలంటే ఆదివారంలోపు అగ్రిమెంట్ సిద్ధం కావాలని స్పష్టం చేసింది. గడువు తర్వాత ఒప్పందం సిద్ధమైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని తేల్చిచెప్పింది.

EU Parliament issues 3-day ultimatum for post-Brexit deal
బ్రిటన్​కు ఈయూ మూడు రోజుల అల్టిమేటం

ఐరోపా సమాఖ్యతో బ్రెగ్జిట్ అనంతరం వర్తక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు బ్రెగ్జిట్ మధ్యవర్తులకు మూడు రోజుల గడువు విధించింది ఐరోపా పార్లమెంట్. ఆదివారం నాటికి ఒప్పందం సిద్ధం కాకపోతే.. దాన్ని ఈ ఏడాదే ఆమోదించేందుకు ఐరోపా పార్లమెంట్ సభ్యులకు సమయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్టిమేటం జారీ చేసింది.

ఒప్పందంపై జరిగిన చర్చల గురించి ఈయూ ముఖ్య మధ్యవర్తి మైకేల్ బార్నియర్ వివరాలు సమర్పించిన అనంతరం పార్లమెంట్ ఈ మేరకు స్పందించింది. ఈ నెల చివరినాటికి ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమేనని, అయితే డిసెంబర్ 20 అర్ధరాత్రిలోపు ఒప్పందం పూర్తి కావాలని షరతు విధించింది. గడువు తర్వాత ఒప్పందం ఖరారైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు బోరిస్ జాన్సన్​కు ఆదివారం వరకు సమయమిస్తున్నామని పేర్కొంది.

బ్రెగ్జిట్ పూర్తయినా..

జనవరి 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగింది. కానీ ఆర్థికం, వర్తకం వంటి విషయాల్లో ఒకే మార్కెట్​గా కొనసాగుతూ వచ్చింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయ్యే డిసెంబర్ 31 వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండానే ఈయూ దేశాలతో వర్తకం సాగించే అవకాశం బ్రిటన్​కు ఉంది. ఆ లోపు ఈయూతో ఒప్పందం కుదరకపోతే స్వేచ్ఛా వాణిజ్యానికి విఘాతం కలుగుతుంది.

బ్రెగ్జిట్ వాణిజ్యానికి సంబంధించి ఏ ఒప్పందాన్నైనా బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శుక్రవారం నుంచి జనవరి 5 వరకు క్రిస్మస్ సెలవుల్లో ఉండనున్నారు. అయితే.. ఒకవేళ ఒప్పందం చివరిదశకు చేరుకుంటే 48 గంటల నోటీసుతో వారిని వెనక్కి రప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఐరోపా సమాఖ్యతో బ్రెగ్జిట్ అనంతరం వర్తక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు బ్రెగ్జిట్ మధ్యవర్తులకు మూడు రోజుల గడువు విధించింది ఐరోపా పార్లమెంట్. ఆదివారం నాటికి ఒప్పందం సిద్ధం కాకపోతే.. దాన్ని ఈ ఏడాదే ఆమోదించేందుకు ఐరోపా పార్లమెంట్ సభ్యులకు సమయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్టిమేటం జారీ చేసింది.

ఒప్పందంపై జరిగిన చర్చల గురించి ఈయూ ముఖ్య మధ్యవర్తి మైకేల్ బార్నియర్ వివరాలు సమర్పించిన అనంతరం పార్లమెంట్ ఈ మేరకు స్పందించింది. ఈ నెల చివరినాటికి ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమేనని, అయితే డిసెంబర్ 20 అర్ధరాత్రిలోపు ఒప్పందం పూర్తి కావాలని షరతు విధించింది. గడువు తర్వాత ఒప్పందం ఖరారైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు బోరిస్ జాన్సన్​కు ఆదివారం వరకు సమయమిస్తున్నామని పేర్కొంది.

బ్రెగ్జిట్ పూర్తయినా..

జనవరి 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగింది. కానీ ఆర్థికం, వర్తకం వంటి విషయాల్లో ఒకే మార్కెట్​గా కొనసాగుతూ వచ్చింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయ్యే డిసెంబర్ 31 వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండానే ఈయూ దేశాలతో వర్తకం సాగించే అవకాశం బ్రిటన్​కు ఉంది. ఆ లోపు ఈయూతో ఒప్పందం కుదరకపోతే స్వేచ్ఛా వాణిజ్యానికి విఘాతం కలుగుతుంది.

బ్రెగ్జిట్ వాణిజ్యానికి సంబంధించి ఏ ఒప్పందాన్నైనా బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శుక్రవారం నుంచి జనవరి 5 వరకు క్రిస్మస్ సెలవుల్లో ఉండనున్నారు. అయితే.. ఒకవేళ ఒప్పందం చివరిదశకు చేరుకుంటే 48 గంటల నోటీసుతో వారిని వెనక్కి రప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.