బ్రెగ్జిట్పై బ్రిటన్ పార్లమెంటులో జరిగిన చారిత్రక ఓటింగ్ ప్రక్రియలో ప్రధాని బోరిస్ జాన్సన్కు ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని అధ్యయనం చేసేందుకు సమయం కావాలంటూ బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు ఓటేశారు.
అక్టోబర్ 31కి బ్రెగ్జిట్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గడువును జనవరి వరకూ పొడిగించేలా ఐరోపా సమాఖ్యను అభ్యర్థించాలన్న ప్రతిపాదనకు బ్రిటన్ పార్లమెంట్ 322-306 ఓట్ల తేడాతో ఆమోదం పలికింది.
అటు గడువు పొడిగించాలంటూ... ఈయూని అభ్యర్థించే ప్రసక్తే లేదని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.
ఈ ఓటింగ్ ప్రక్రియ ఎందుకంత కీలకం?
ఈ ఓటింగ్ కోసం బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. 1982 తర్వాత శనివారం రోజున బ్రిటన్ పార్లమెంట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి.
బ్రెగ్జిట్కు ఆమోదం లభించలేదు కాబట్టి.. ఆప్రక్రియను ఆలస్యం చేయడానికి చట్టం రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. అయితే బ్రెగ్జిట్ను వాయిదా వేయడం సరికాదని బోరిస్ ఇటీవల అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: లెబనాన్: పన్ను విధింపుపై పెల్లుబికిన ప్రజాగ్రహం