ETV Bharat / international

వరదలకు 110 మంది బలి- 1300 మంది గల్లంతు! - ఐరోపాలో వరదలు

జర్మనీ, బెల్జియంలో వరదల ధాటికి మృతిచెందినవారి సంఖ్య 110కి పెరిగింది. గల్లంతైన వందలాది మందికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహానికి అనేక ఇళ్లు కూలిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి.

floods, germany
జర్మనీ, వరదలు
author img

By

Published : Jul 16, 2021, 5:39 PM IST

Updated : Jul 16, 2021, 8:16 PM IST

జర్మనీలో వరద బీభత్సం

ఐరోపాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియం​లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి పెరిగింది. భారీ వర్ష బీభత్సానికి వందలాది మంది గల్లంతవగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

floods, germany
జలమయమైన జర్మనీ

రెండు ప్రాంతాల్లోనే అధికంగా..

జర్మనీలోని రైన్​లాండ్, పలాటినేట్​ ప్రాంతాల్లో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. నార్త్​ రైన్- వెస్ట్​ ఫాలియా రాష్ట్రంలో మృతుల సంఖ్య 43కు చేరినట్లు ఆ ప్రాంతంలోని అధికారులు తెలిపారు.

floods, germany
బీభత్సం సృష్టిస్తున్న వరదలు
floods, germany
నేలమట్టమైన ఇళ్లు

వరదల ధాటికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కార్లు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు తెగిపోగా.. కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే.. జర్మనీలో ఇప్పటివరకు 1300 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.

floods, germany
భారీగా ప్రవహిస్తున్న వరద నీరు
floods, germany
వరద ధాటికి కొట్టుకుపోయిన కారు

బెల్జియంలో 12 మంది..

బెల్జియంలో వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది.

ఇదీ చదవండి:

వరద విలయం- 60 మందికి పైగా మృతి

ముంచెత్తిన వరద- 110 మంది బలి

జర్మనీలో వరద బీభత్సం

ఐరోపాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియం​లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి పెరిగింది. భారీ వర్ష బీభత్సానికి వందలాది మంది గల్లంతవగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

floods, germany
జలమయమైన జర్మనీ

రెండు ప్రాంతాల్లోనే అధికంగా..

జర్మనీలోని రైన్​లాండ్, పలాటినేట్​ ప్రాంతాల్లో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. నార్త్​ రైన్- వెస్ట్​ ఫాలియా రాష్ట్రంలో మృతుల సంఖ్య 43కు చేరినట్లు ఆ ప్రాంతంలోని అధికారులు తెలిపారు.

floods, germany
బీభత్సం సృష్టిస్తున్న వరదలు
floods, germany
నేలమట్టమైన ఇళ్లు

వరదల ధాటికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కార్లు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు తెగిపోగా.. కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే.. జర్మనీలో ఇప్పటివరకు 1300 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.

floods, germany
భారీగా ప్రవహిస్తున్న వరద నీరు
floods, germany
వరద ధాటికి కొట్టుకుపోయిన కారు

బెల్జియంలో 12 మంది..

బెల్జియంలో వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది.

ఇదీ చదవండి:

వరద విలయం- 60 మందికి పైగా మృతి

ముంచెత్తిన వరద- 110 మంది బలి

Last Updated : Jul 16, 2021, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.