ETV Bharat / international

''పాక్​లో​ ఎఫ్​-16 జెట్​లు సురక్షితమే..!''

author img

By

Published : Apr 5, 2019, 3:21 PM IST

Updated : Apr 5, 2019, 3:28 PM IST

పాకిస్థాన్​కు​ అమెరికా అందించిన ఎఫ్​-16 యుద్ధ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని ఓ నివేదికలో తేలిందంటూ యూఎస్​కు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్​ ప్రచురించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అమెరికా సైనికాధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.

పాక్​ ఎఫ్​-16 కూలలేదంటూ అమెరికా పత్రిక కథనం

తమ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చలేదన్న పాకిస్థాన్​ వాదనలకు బలం చేకూరేలా అమెరికాకు చెందిన 'ఫారిన్​ పాలసీ మ్యాగజైన్​' ఓ​ కథనం ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా పాక్​కు అమెరికా అందించిన ఎఫ్​-16 యుద్ధ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని కథనంలో పేర్కొంది.​ అమెరికా రక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించారని తెలిపింది.

పాక్​ ఆహ్వానం మేరకు ఎఫ్​-16 యుద్ధ విమానాలను లెక్కించేందుకు అమెరికా సైన్యం వెళ్లింది. "క్షేత్రస్థాయిలో.. పాకిస్థాన్​లో ఎఫ్​-16 యుద్ధ విమానాల లెక్కింపు పూర్తయింది. అక్కడ విమానాలన్నీ ఉన్నాయి" అని ఓ అమెరికా సైనికాధికారి తెలిపినట్లు 'ఫారిన్​ పాలసీ మ్యాగజైన్​' పేర్కొంది.

అయితే ఈ విషయంపై అమెరికా అధికారులు ఇంకా స్పందించలేదు.

ఇదీ జరిగింది....

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్​ ఘాటుగా స్పందించింది. బాలాకోట్​లోని పాక్​ ఉగ్ర శిబిరాలను వైమానికి దాడులతో నేలమట్టం చేసింది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడికి యత్నించిన పాక్​ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్టు ఫిబ్రవరి 28న రక్షణ అధికారులు ప్రకటించారు.

తమ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చలేదన్న పాకిస్థాన్​ వాదనలకు బలం చేకూరేలా అమెరికాకు చెందిన 'ఫారిన్​ పాలసీ మ్యాగజైన్​' ఓ​ కథనం ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా పాక్​కు అమెరికా అందించిన ఎఫ్​-16 యుద్ధ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని కథనంలో పేర్కొంది.​ అమెరికా రక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించారని తెలిపింది.

పాక్​ ఆహ్వానం మేరకు ఎఫ్​-16 యుద్ధ విమానాలను లెక్కించేందుకు అమెరికా సైన్యం వెళ్లింది. "క్షేత్రస్థాయిలో.. పాకిస్థాన్​లో ఎఫ్​-16 యుద్ధ విమానాల లెక్కింపు పూర్తయింది. అక్కడ విమానాలన్నీ ఉన్నాయి" అని ఓ అమెరికా సైనికాధికారి తెలిపినట్లు 'ఫారిన్​ పాలసీ మ్యాగజైన్​' పేర్కొంది.

అయితే ఈ విషయంపై అమెరికా అధికారులు ఇంకా స్పందించలేదు.

ఇదీ జరిగింది....

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్​ ఘాటుగా స్పందించింది. బాలాకోట్​లోని పాక్​ ఉగ్ర శిబిరాలను వైమానికి దాడులతో నేలమట్టం చేసింది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడికి యత్నించిన పాక్​ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్టు ఫిబ్రవరి 28న రక్షణ అధికారులు ప్రకటించారు.

Chennai, Apr 05 (ANI): Ahead of Lok Sabha elections, Election Commission of India addressed mediapersons in Chennai. Election Commissioner Ashok Lavasa told about the demands that political parties raised. Lavasa said, "During our meetings with political parties, they brought out certain issues. All the political parties demanded to effectively check distribution of money and freebies to voters and urged a commission to take a criminal action against those who are involved. Some of the parties requested the commission to issue directions to avoid harassment of common people during the function of flying squads." The Lok Sabha election is scheduled to be held in seven phases beginning from April 11 and concluding on May 19. The counting of votes will take place on May 23.

Last Updated : Apr 5, 2019, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.