'ఫాన్ఫొన్' తుపాను ఫిలిప్పీన్స్ను అతలాకుతలం చేసింది. తుపాను సృష్టించిన బీభత్సానికి 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
క్రిస్మస్ పర్వదినాన సంభవించిన భారీ తుపాను ధాటికి పలు ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.