ETV Bharat / international

వియత్నాం వరదల్లో 35 మంది మృతి - వియత్నం నేటి వార్తలు

ఓవైపు తుపాను బీభత్సం, మరోవైపు కొండచరియలు విరిగిపడటం.. వియత్నాంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 35మంది మృతిచెందగా.. 50మందికిపైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. మృతదేహాలను వెలికితీస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Typhoon, landslides leave 35 dead, dozens missing in Vietnam
వియత్నాంలో 35 మంది మృతి.. కారణమిదే.?
author img

By

Published : Oct 30, 2020, 12:04 PM IST

వియాత్నాంలో తుపాను, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. తుపాను బీభత్సానికి అనేక చోట్ల విద్యుత్​ అవాంతరాలు ఏర్పడ్డాయి. ఫలితంగా గురువారం సుమారు 17 లక్షల మంది కరెంట్​ కష్టాలు ఎదుర్కొన్నారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా.. పలుచోట్ల ట్రాఫిక్​ సమస్యలూ ఎదురయ్యాయి. అయితే.. గత 20ఏళ్లలో ఇదే అత్యంత భయంకరమైన తుపాను అని అధికారులు పేర్కొన్నారు.

ఆ దేశంలో మూడు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు అక్కడి సహాయక బృందం భావిస్తోంది. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.

మొలావ్​ బీభత్సం..

మరోవైపు.. ఆ దేశంలో మొలావ్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 150కిలోమీటర్ల(93 మైళ్లు) వేగంతో ప్రమాదకరస్థాయిలో గాలులు వీస్తున్నాయి. మొలావ్​ ధాటికి ఇప్పటివరకు 12 మంది మత్స్యకారులు చనిపోగా.. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి- ఐరోపా​లో కోటి మార్క్​ను దాటిన కరోనా కేసులు

వియాత్నాంలో తుపాను, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. తుపాను బీభత్సానికి అనేక చోట్ల విద్యుత్​ అవాంతరాలు ఏర్పడ్డాయి. ఫలితంగా గురువారం సుమారు 17 లక్షల మంది కరెంట్​ కష్టాలు ఎదుర్కొన్నారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా.. పలుచోట్ల ట్రాఫిక్​ సమస్యలూ ఎదురయ్యాయి. అయితే.. గత 20ఏళ్లలో ఇదే అత్యంత భయంకరమైన తుపాను అని అధికారులు పేర్కొన్నారు.

ఆ దేశంలో మూడు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు అక్కడి సహాయక బృందం భావిస్తోంది. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.

మొలావ్​ బీభత్సం..

మరోవైపు.. ఆ దేశంలో మొలావ్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 150కిలోమీటర్ల(93 మైళ్లు) వేగంతో ప్రమాదకరస్థాయిలో గాలులు వీస్తున్నాయి. మొలావ్​ ధాటికి ఇప్పటివరకు 12 మంది మత్స్యకారులు చనిపోగా.. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి- ఐరోపా​లో కోటి మార్క్​ను దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.