ETV Bharat / international

ఆ కుక్కలకు యజమానుల నుంచే కరోనా సోకింది

మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి మూగజీవాలనూ వదలట్లేదు. మనుషులకు సోకిన వైరస్​.. వారు పెంచుకునే జంతువులకూ వ్యాపిస్తోంది. హాంకాంగ్‌లో రెండు పెంపుడు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే కరోనా సోకిందని పరిశోధకులు గుర్తించారు.

author img

By

Published : May 17, 2020, 7:31 AM IST

two dogs test corona positive in hongkong
కుక్కలకు సోకిన కరోనా.. యజమానులే కారణం!

హాంకాంగ్‌లో కరోనా సోకిన రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే వైరస్‌ వ్యాపించిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కుక్కలు, వాటి యజమానుల్లోని వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ కుక్కల నుంచి ఇతర కుక్కలకు లేదంటే మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వీరు వెల్లడించారు.

కొవిడ్‌-19 బాధితుల నుంచి కుక్కలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుందని స్పష్టమైనప్పటికీ అందుకుగల అవకాశాలు చాలా తక్కువని వీరు స్పష్టంచేస్తున్నారు. వ్యాధి బాధితులతో కలిసి ఉన్న 15 కుక్కల్లో కేవలం రెండింటికి మాత్రమే ఈ వైరస్‌ సోకిందని నెదర్లాండ్స్‌ వైద్యులు తమ అధ్యయనంలో గుర్తించారు.

భవిష్యత్తులో తలెత్తే ముప్పులను నివారించాలంటే.. పెంపుడు జంతువుల మధ్య వైరస్‌ వ్యాప్తిపై కూలంకషంగా అధ్యయనం చేయాలని మరికొందరు పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. హాంకాంగ్‌లో ఈ రెండు కుక్కలతో పాటు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, జంతు ప్రదర్శనశాలలోని 4 పులులు, 3 సింహాలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

అలానే పిల్లులపై నిర్వహించిన సర్వేలో.. ఇవి లక్షణాలు లేకుండా ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాధి బాధితులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:గొడవ పడిన భార్యాభర్తలను ఒక్కటి చేసిన 'లాక్​డౌన్​ జర్నీ'!

హాంకాంగ్‌లో కరోనా సోకిన రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే వైరస్‌ వ్యాపించిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కుక్కలు, వాటి యజమానుల్లోని వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ కుక్కల నుంచి ఇతర కుక్కలకు లేదంటే మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వీరు వెల్లడించారు.

కొవిడ్‌-19 బాధితుల నుంచి కుక్కలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుందని స్పష్టమైనప్పటికీ అందుకుగల అవకాశాలు చాలా తక్కువని వీరు స్పష్టంచేస్తున్నారు. వ్యాధి బాధితులతో కలిసి ఉన్న 15 కుక్కల్లో కేవలం రెండింటికి మాత్రమే ఈ వైరస్‌ సోకిందని నెదర్లాండ్స్‌ వైద్యులు తమ అధ్యయనంలో గుర్తించారు.

భవిష్యత్తులో తలెత్తే ముప్పులను నివారించాలంటే.. పెంపుడు జంతువుల మధ్య వైరస్‌ వ్యాప్తిపై కూలంకషంగా అధ్యయనం చేయాలని మరికొందరు పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. హాంకాంగ్‌లో ఈ రెండు కుక్కలతో పాటు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, జంతు ప్రదర్శనశాలలోని 4 పులులు, 3 సింహాలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

అలానే పిల్లులపై నిర్వహించిన సర్వేలో.. ఇవి లక్షణాలు లేకుండా ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాధి బాధితులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:గొడవ పడిన భార్యాభర్తలను ఒక్కటి చేసిన 'లాక్​డౌన్​ జర్నీ'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.