'కాన్ఫరెన్స్ ఆన్ డైలాగ్ ఆఫ్ ఆసియా సివిలైజేషన్' (సీడీఏసీ) సదస్సుకు చైనా వేదికైంది. ఆసియాలోని వివిధ నాగరికతల మధ్య పరస్పర ప్రోత్సాహం, భవిష్యత్తు సమాజ నిర్మాణంలో భాగస్వామ్యంపై అవగాన కల్పించటమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మే 22 వరకు సీడీఏసీ సదస్సు జరగనుంది.
సీడీఏసీలో భాగంగా చైనా రాజధాని బీజింగ్లో 'ఆసియా కల్చరల్' కార్నివాల్ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. 'సెలబ్రేషన్ ఆఫ్ యూత్, డ్రీమ్ ఆఫ్ ఆసియా' అనే థీమ్తో నిర్వహిస్తున్న కార్నివాల్కు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి దాదాపు 8 వేల మంది కళాకారులు హాజరయ్యారు. తమ ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. విద్యుత్ కాంతులతో బీజింగ్ బర్డ్స్ నెస్ట్ జాతీయ మైదానం మెరిసిపోతోంది.
ఆరు నెలల ముందు నుంచే..
కార్నివాల్ నిర్వహించేందుకు ఆరు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభించింది చైనా. కార్నివాల్ కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేపట్టారు.
గిన్నీస్ రికార్డు...
కార్నివాల్ కోసం ప్రత్యేకంగా సుమారు 15వేల చదరపు మీటర్లతో వేదికను నిర్మించారు. ప్రపంచంలో ఏ స్టేడియంలోనూ ఇంత పెద్ద వేదిక లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇందులో భారీ 3డీ ఎల్ఈడీ లైట్ మాట్రిక్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. సుమారు 2500 రకాల ఎల్ఈడీ కాంతులతో ఏర్పాటు చేసిన ఈ వేదికకు గిన్నీస్ వరల్డ్ రికార్డు దక్కింది.
ఇదీ చూడండి: గ్రీన్కార్డు కాదు... ఇకపై 'బిల్డ్ అమెరికా' వీసా