ETV Bharat / international

మాస్కు ధరించలేదని ప్రధానికి జరిమానా! - థాయ్​లాండ్​ ప్రధాని

మాస్కు ధరించలేదని థాయ్​లాండ్​ ప్రధాని జనరల్​ ప్రయూత్​ చాన్​-వో-చాకు అధికారులు జరిమానా విధించారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మే 1 నుంచి భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది థాయ్​లాండ్​.

Thailand PM
థాయ్​లాండ్​ ప్రధాని
author img

By

Published : Apr 27, 2021, 10:01 AM IST

అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు థాయ్​లాండ్​ ప్రధానమంత్రి జనరల్​ ప్రయూత్​ చాన్​-వో-చాకు అధికారులు ఆరు వేల భాట్​ల(సుమారు రూ.14,270) జరిమానా విధించారు! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్​ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్​ నుంచి థాయ్​ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

మాస్కు ధరించకపోతే భారీ ఫైన్​

ఇక బ్యాంకాక్​ మెట్రోపాలిటన్​ అడ్మిస్ట్రేషన్​ నిబంధనల ప్రకారం.. రాజధానిలోని ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000 భాట్లు(రూ.47,610) జరిమానా విధిస్తారు. వ్యాక్సిన్​ కొనుగోలు విషయమై సలహాదారులతో ప్రధాని ప్రయూత్​.. సోమవారం సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకాక్​ గవర్నర్​ ఆశ్విన్​ క్వాన్ ​ముయాంగ్​ తన ఫేస్​బుక్​ ఖాతాలో వెల్లడించారు. కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడం వల్ల ప్రయూత్​కు అధికారులు జరిమానా విధించారు.

కాగా, థాయ్​లాండ్​ పౌరులు మినహా మిగతా వారికి తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే ప్రవేశ ధ్రువీకరణ పత్రాల(సీఓఈ) మంజూరును మే 1 నుంచి రద్దు చేస్తున్నట్లు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకు వర్తిస్తుంది.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ కంటే శవాల గుట్టలే మేలు!'

అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు థాయ్​లాండ్​ ప్రధానమంత్రి జనరల్​ ప్రయూత్​ చాన్​-వో-చాకు అధికారులు ఆరు వేల భాట్​ల(సుమారు రూ.14,270) జరిమానా విధించారు! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్​ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్​ నుంచి థాయ్​ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

మాస్కు ధరించకపోతే భారీ ఫైన్​

ఇక బ్యాంకాక్​ మెట్రోపాలిటన్​ అడ్మిస్ట్రేషన్​ నిబంధనల ప్రకారం.. రాజధానిలోని ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000 భాట్లు(రూ.47,610) జరిమానా విధిస్తారు. వ్యాక్సిన్​ కొనుగోలు విషయమై సలహాదారులతో ప్రధాని ప్రయూత్​.. సోమవారం సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకాక్​ గవర్నర్​ ఆశ్విన్​ క్వాన్ ​ముయాంగ్​ తన ఫేస్​బుక్​ ఖాతాలో వెల్లడించారు. కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడం వల్ల ప్రయూత్​కు అధికారులు జరిమానా విధించారు.

కాగా, థాయ్​లాండ్​ పౌరులు మినహా మిగతా వారికి తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే ప్రవేశ ధ్రువీకరణ పత్రాల(సీఓఈ) మంజూరును మే 1 నుంచి రద్దు చేస్తున్నట్లు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకు వర్తిస్తుంది.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ కంటే శవాల గుట్టలే మేలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.