ETV Bharat / international

తాలిబన్ల మెరుపు వేగానికి కారణం.. ఈ దళం!

author img

By

Published : Aug 16, 2021, 6:40 PM IST

తాలిబన్లు ఇంత త్వరగా అఫ్గానిస్థాన్​లో అధికారం చేజిక్కించుకోవడం వెనుక ఓ ప్రత్యేక దళం కీలక పాత్ర పోషించింది. 2015లో ఇస్లామిక్​ స్టేట్​పై పోరాడేందుకు తాలిబన్లు నెలకొల్పిన ఈ ఎరుపు దళమే(రెడ్ యూనిట్​) ఇప్పుడు వారికి అధికారాన్ని మెరుపు వేగంతో కట్టబెట్టింది. వారి శక్తి సామర్థ్యాలు, ప్రత్యేకతలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

Taliban's 'Red Unit' spearheads blitzkrieg in Afghanistan
'ఎరుపు దళం' మెరుపు దాడులతోనే అఫ్గాన్ తాలిబన్ల వశం!

ఎవరూ ఊహించని వేగంతో అప్గానిస్థాన్​ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. అత్యంత శక్తిమంతమైన అమెరికా దళాలతో శిక్షణ తీసుకున్న అప్గాన్ సైనికులు పెద్దగా ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. కొందరు సైనికులైతే వీరిని చూసి పారిపోయారు. తాలిబన్లు ఇంత త్వరగా కాబుల్​లోకి ప్రవేశించి అధికారం చేజిక్కించుకోవడానికి ఓ ప్రత్యేక దళమే కారణం. ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టగల సామర్థ్యం దీని సొంతం.

ఎరుపు దళం..

అఫ్గాన్​లో తాలిబన్లు, సైన్యం మధ్య యుద్ధాన్ని క్షేత్రస్థాయిలో వీక్షించిన స్థానికులు ఈ ప్రత్యేక దళం గురించి వివరించారు. పాష్టో బాషలో 'సర ఖేత'గా పిలిచే ఈ దళాన్ని 'రెడ్​ యూనిట్​' అంటారు.

తాలిబన్లు ఏ ప్రదేశాన్నైనా లక్ష్యంగా పెట్టుకుంటే.. ముందుగా అక్కడికి ఈ ఎరుపు దళం వెళుతుంది. శత్రువుల్లో కీలకమైన వ్యక్తులను చాకచక్యంగా మట్టుబెడుతుంది. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిన తర్వాత తాలిబన్ల సైన్యం అక్కడకు వెళ్లి ఆ ప్రదేశాన్ని తమ హస్తగతం చేసుకుంటుంది.

ప్రత్యేక వేషధారణ

ఈ ఎరుపు సైన్యం వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తలకు ఎరుపు రంగు బ్యాండ్​, కాళ్లకు పాకిస్థాన్​లో తయారు చేసిన చీతా స్నీకర్లు, ఎల్బో గార్డులు, మోకాలి ప్యాడ్లు, ప్రత్యేక గ్లోవ్​లు, చాతి కవచం ధరిస్తారు. మిలటరీకి మించి కఠోర శిక్షణ తీసుకుంటారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రైఫిళ్లు ఉంటాయి. యుద్ధవిమానాలను నిర్వీర్యం చేయగల తుపాకులుంటాయి. అమెరికాలో తయారైన ఎం4 కార్బైన్లు, తేలికపాటి మెషీన్ గన్లు సహా మిలటరీలో ఉపయోగించే ఆయుధాలన్నీ వీరికి తాలిబన్లు సమకూర్చుతారు. రాత్రివేళలో స్పష్టంగా చూడగలిగే సాధానాలు, లేజర్ పాయింటర్లు కూడా వీరి వద్ద ఉంటాయి. అంతేగాకుండా వీరు అఫ్గాన్ యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి.. వారు తాలిబన్లతో కలిసి పోరాడేలా చేస్తారు.

మెరుపు వేగం..

తాలిబన్లు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో స్థానికంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే.. ఎరుపు సైన్యం మాత్రం ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతుంటుంది. అఫ్గాన్​లో ఎక్కడికైనా మెరుపు వేగంతో చేరుకోగలగడం వీరి ప్రత్యేకత.

ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థతో పోరాడేందుకు 2015 అక్టోబర్​లో తాలిబన్లు ఈ ఎరుపు దళాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో వందల్లో ఉన్న వీరి సంఖ్య ఇప్పుడు వేలకు చేరుకుంది. వీరి దెబ్బకు అఫ్గాన్​లో ఇస్లామిక్ స్టేట్ ఉనికి కోల్పోయింది.

తాలిబన్లు 2016లో తొలిసారి ఎరుపు దళాన్ని ఈశాన్య సంగిన్​లో మోహరించారు. ఆ తర్వాత 2018నాటికి దేశమంతా విస్తరించారు.

(రచయిత-సంజీవ్ బారువా)
ఇదీ చూడండి: Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్​ ప్రజలు

అఫ్గాన్‌లో యుద్ధం ముగిసింది.. తాలిబన్ల ప్రకటన

ఎవరూ ఊహించని వేగంతో అప్గానిస్థాన్​ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. అత్యంత శక్తిమంతమైన అమెరికా దళాలతో శిక్షణ తీసుకున్న అప్గాన్ సైనికులు పెద్దగా ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. కొందరు సైనికులైతే వీరిని చూసి పారిపోయారు. తాలిబన్లు ఇంత త్వరగా కాబుల్​లోకి ప్రవేశించి అధికారం చేజిక్కించుకోవడానికి ఓ ప్రత్యేక దళమే కారణం. ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టగల సామర్థ్యం దీని సొంతం.

ఎరుపు దళం..

అఫ్గాన్​లో తాలిబన్లు, సైన్యం మధ్య యుద్ధాన్ని క్షేత్రస్థాయిలో వీక్షించిన స్థానికులు ఈ ప్రత్యేక దళం గురించి వివరించారు. పాష్టో బాషలో 'సర ఖేత'గా పిలిచే ఈ దళాన్ని 'రెడ్​ యూనిట్​' అంటారు.

తాలిబన్లు ఏ ప్రదేశాన్నైనా లక్ష్యంగా పెట్టుకుంటే.. ముందుగా అక్కడికి ఈ ఎరుపు దళం వెళుతుంది. శత్రువుల్లో కీలకమైన వ్యక్తులను చాకచక్యంగా మట్టుబెడుతుంది. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిన తర్వాత తాలిబన్ల సైన్యం అక్కడకు వెళ్లి ఆ ప్రదేశాన్ని తమ హస్తగతం చేసుకుంటుంది.

ప్రత్యేక వేషధారణ

ఈ ఎరుపు సైన్యం వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తలకు ఎరుపు రంగు బ్యాండ్​, కాళ్లకు పాకిస్థాన్​లో తయారు చేసిన చీతా స్నీకర్లు, ఎల్బో గార్డులు, మోకాలి ప్యాడ్లు, ప్రత్యేక గ్లోవ్​లు, చాతి కవచం ధరిస్తారు. మిలటరీకి మించి కఠోర శిక్షణ తీసుకుంటారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రైఫిళ్లు ఉంటాయి. యుద్ధవిమానాలను నిర్వీర్యం చేయగల తుపాకులుంటాయి. అమెరికాలో తయారైన ఎం4 కార్బైన్లు, తేలికపాటి మెషీన్ గన్లు సహా మిలటరీలో ఉపయోగించే ఆయుధాలన్నీ వీరికి తాలిబన్లు సమకూర్చుతారు. రాత్రివేళలో స్పష్టంగా చూడగలిగే సాధానాలు, లేజర్ పాయింటర్లు కూడా వీరి వద్ద ఉంటాయి. అంతేగాకుండా వీరు అఫ్గాన్ యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి.. వారు తాలిబన్లతో కలిసి పోరాడేలా చేస్తారు.

మెరుపు వేగం..

తాలిబన్లు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో స్థానికంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే.. ఎరుపు సైన్యం మాత్రం ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతుంటుంది. అఫ్గాన్​లో ఎక్కడికైనా మెరుపు వేగంతో చేరుకోగలగడం వీరి ప్రత్యేకత.

ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థతో పోరాడేందుకు 2015 అక్టోబర్​లో తాలిబన్లు ఈ ఎరుపు దళాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో వందల్లో ఉన్న వీరి సంఖ్య ఇప్పుడు వేలకు చేరుకుంది. వీరి దెబ్బకు అఫ్గాన్​లో ఇస్లామిక్ స్టేట్ ఉనికి కోల్పోయింది.

తాలిబన్లు 2016లో తొలిసారి ఎరుపు దళాన్ని ఈశాన్య సంగిన్​లో మోహరించారు. ఆ తర్వాత 2018నాటికి దేశమంతా విస్తరించారు.

(రచయిత-సంజీవ్ బారువా)
ఇదీ చూడండి: Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్​ ప్రజలు

అఫ్గాన్‌లో యుద్ధం ముగిసింది.. తాలిబన్ల ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.