పాకిస్థాన్లో సోమవారం రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 65కు పెరిగింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. కాగ, ఈ ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎలా జరిగింది?
సోమవారం ఉదయం కరాచీ నుంచి సర్గోధాకు వెళ్తున్న మిల్లత్ ఎక్స్ప్రెస్.. ధార్కి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న సర్ సయద్ ఎక్స్ప్రెస్.. మిల్లత్ రైలును ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళలు, రైల్వే అధికారులు సైతం మరణించారు. చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దింపింది పాక్ ప్రభుత్వం.
సహాయక చర్యలు ముగిసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇంజన్ సహా 17 కోచ్లను పట్టాల మీద నుంచి తప్పించారు. ఆ మార్గంలో రైల్వే సేవలు పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
అలా అయితే రాజీనామా..
ప్రమాదానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్పై పాక్ రైల్వే మంత్రి అజామ్ స్వాతి స్పందించారు. తన రాజీనామాతో చనిపోయినవారు బతికొస్తే.. అందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: మెట్రోరైలు ప్రమాదం: 23కు మృతుల సంఖ్య