పాకిస్థాన్ కరాచీలో ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు చేసిన దాడిలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది గాయపడ్డారు.
వివాహ వేడుక నుంచి తిరిగి వెళ్తుండగా..
వారంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 20 నుంచి 25 మంది ట్రక్కులో ఉన్నట్లు తెలిపారు. ట్రక్కు అనుసరించి దుండగులు.. గ్రనేడ్ విసిరి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి: హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!