ETV Bharat / international

ప్రధానమంత్రికి కరోనా నిర్ధరణ పరీక్షలు

author img

By

Published : Aug 12, 2020, 4:51 PM IST

గత వారం పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ను కలిసిన వ్యక్తికి కరోనా సోకిన నేపథ్యంలో ఆ దేశ యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం ప్రధానికి వైరస్​ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

Pak PM Imran tests for COVID-19: report
ప్రధానమంత్రికి కరోనా నిర్ధరణ పరీక్షలు

పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. గత వారం ఇమ్రాన్​ను కలిసిన ఈదీ సేవా సంస్థ అధిపతి కుమారుడికి తాజాగా కరోనా నిర్ధరణ అయిన నేపథ్యంలో ప్రధానికి పరీక్షలు చేసినట్లు వివరించారు.

పాకిస్థాన్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ నియంత్రణ కోసం తన వంతు సాయం అందించటం కోసం ఈదీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడి కుమారుడు ఫైజల్​ ఏప్రిల్ ​15న ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్కును ప్రధానికి అందించారు. తాజాగా ఫైజల్‌కు కరోనా పాజిటివ్​ అని తేలింది.

పాకిస్థాన్​లో​ ఇప్పటి వరకు 9,749 మందికి వైరస్​ సోకగా.. 209 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. గత వారం ఇమ్రాన్​ను కలిసిన ఈదీ సేవా సంస్థ అధిపతి కుమారుడికి తాజాగా కరోనా నిర్ధరణ అయిన నేపథ్యంలో ప్రధానికి పరీక్షలు చేసినట్లు వివరించారు.

పాకిస్థాన్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ నియంత్రణ కోసం తన వంతు సాయం అందించటం కోసం ఈదీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడి కుమారుడు ఫైజల్​ ఏప్రిల్ ​15న ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్కును ప్రధానికి అందించారు. తాజాగా ఫైజల్‌కు కరోనా పాజిటివ్​ అని తేలింది.

పాకిస్థాన్​లో​ ఇప్పటి వరకు 9,749 మందికి వైరస్​ సోకగా.. 209 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.