భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లే ప్రయాణికులపై నిషేధం విధిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా కరోనా కేసులు భారీగా వెలుగుచూడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ నిషేధం మరో రెండు వారాల పాటు కొనసాగుతుందని పేర్కొంది.
ఇప్పటికే హాంకాంగ్, బ్రిటన్ ప్రభుత్వాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్ను ట్రావెల్ 'రెడ్ లిస్ట్'లో చేర్చతున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1.50 కోట్లు దాటాయి. గడిచిన 15 రోజుల్లో 25 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షల పైగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
ఇదీ చూడండి: భారత్ను 'రెడ్ లిస్ట్'లో చేర్చిన బ్రిటన్