ETV Bharat / international

చైనా తీరును ప్రశ్నించిన 40 దేశాలు

author img

By

Published : Oct 7, 2020, 9:56 AM IST

Updated : Oct 7, 2020, 11:52 AM IST

మైనారిటీ వర్గాలపై చైనా తీరును 40 పశ్చిమ దేశాలు తప్పుబట్టాయి. నూతన జాతీయ భద్రత చట్టం వల్ల హాంకాంగ్​లోని మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. షిన్​​జియాంగ్​లో స్వతంత్ర పరిశీలనకు అవకాశమివ్వాలని డిమాండ్​ చేశాయి.

Nearly 40 nations criticize China's human rights policies
మైనారిటీలపై చైనా తీరును విమర్శించిన పశ్చిమ దేశాలు

చైనాలోని షిన్​‌జియాంగ్‌, టిబెట్​లో మైనారిటీ వర్గాలపై ఆ దేశం వ్యవహరిస్తున్న తీరును 40 పశ్చిమ దేశాలు విమర్శించాయి. హాంకాంగ్‌లోని మానవహక్కులపై నూతన జాతీయ భద్రత చట్టం ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. షిన్​జియాంగ్‌లో పరిస్థితుల అధ్యయానికి ఐరాస మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు మిచెల్లీ బాచ్‌లెట్‌ సహా ఇతర స్వతంత్ర పరిశీలకులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.

ఇదీ చూడండి: చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!

అమెరికా, జపాన్​ కూడా..

చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాల్లో అమెరికా, జపాన్​ సహా ఐరోపా దేశాలు ఉన్నాయి. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని ఆమోదించడమే కాకుండా ఆ దేశ‌ న్యాయవ్యవస్థను గౌరవించాలని 40 దేశాలు కోరాయి. ఈ మేరకు ఐరాస మానహక్కుల కమిటీ సాధారణ సమావేశంలో సంయుక్త ప్రకటనను వెల్లడించాయి.

పాక్​ మద్దతుగా..

హాంకాంగ్‌-చైనా వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 55 దేశాల మద్దతుతో చైనా తరఫున పాకిస్థాన్‌ ప్రకటన చేసింది. దీనితో చైనా, పశ్చిమ దేశాల మధ్య మానవహక్కుల అంశంలో విబేధాలు పెరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చైనాలో 16వేల ప్రార్థనా మందిరాలు ధ్వంసం!

చైనాలోని షిన్​‌జియాంగ్‌, టిబెట్​లో మైనారిటీ వర్గాలపై ఆ దేశం వ్యవహరిస్తున్న తీరును 40 పశ్చిమ దేశాలు విమర్శించాయి. హాంకాంగ్‌లోని మానవహక్కులపై నూతన జాతీయ భద్రత చట్టం ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. షిన్​జియాంగ్‌లో పరిస్థితుల అధ్యయానికి ఐరాస మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు మిచెల్లీ బాచ్‌లెట్‌ సహా ఇతర స్వతంత్ర పరిశీలకులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.

ఇదీ చూడండి: చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!

అమెరికా, జపాన్​ కూడా..

చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాల్లో అమెరికా, జపాన్​ సహా ఐరోపా దేశాలు ఉన్నాయి. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని ఆమోదించడమే కాకుండా ఆ దేశ‌ న్యాయవ్యవస్థను గౌరవించాలని 40 దేశాలు కోరాయి. ఈ మేరకు ఐరాస మానహక్కుల కమిటీ సాధారణ సమావేశంలో సంయుక్త ప్రకటనను వెల్లడించాయి.

పాక్​ మద్దతుగా..

హాంకాంగ్‌-చైనా వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 55 దేశాల మద్దతుతో చైనా తరఫున పాకిస్థాన్‌ ప్రకటన చేసింది. దీనితో చైనా, పశ్చిమ దేశాల మధ్య మానవహక్కుల అంశంలో విబేధాలు పెరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చైనాలో 16వేల ప్రార్థనా మందిరాలు ధ్వంసం!

Last Updated : Oct 7, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.