ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఆయన కోమాలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా విడుదైలన ఫొటోలతో ఇదంతా అసత్య ప్రచారమని రుజువవుతోంది. టైఫూన్ బవి తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించారు కిమ్. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. అయితే ఆయన ఎప్పుడు పర్యటించారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఫొటోలను గమనిస్తే బహుశా గురువారం మధ్యాహ్నం ఆయన సందర్శన జరిగి ఉంటుందని తెలుస్తోంది.
![Kim Jong Un visits area hit by Typhoon Bavi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8586461_379_8586461_1598591242622.png)
![Kim Jong Un visits area hit by Typhoon Bavi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8586461_587_8586461_1598591263612.png)
![Kim Jong Un visits area hit by Typhoon Bavi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8586461_118_8586461_1598591290917.png)