ETV Bharat / international

ఆ గ్రహశకల నమూనాల్లో ఉన్న రహస్యాలేంటి? - జపాన్​ శాస్త్రవేత్తలు

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహశకలం నుంచి విజయవంతంగా నమూనాలను భూమికి చేర్చారు జపాన్​ శాస్త్రవేత్తలు. ఇందుకోసం ఆరేళ్ల పాటు శ్రమించారు. ఆస్ట్రేలియాలో ల్యాండ్​ అయిన క్యాప్సూల్​ను అక్కడే ల్యాబ్​లో ప్రాథమిక భద్రతా తనిఖీలు నిర్వహించి.. జపాన్​కు తరలిస్తారు. ఈ క్రమంలో గ్రహశకల నమూనాలను పరిశీలించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు.

asteroid samples
రియూగు గ్రహశకలం నమూనాలు
author img

By

Published : Dec 7, 2020, 2:04 PM IST

సుదూర గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో జపాన్​ క్యాప్సూల్​ ఆదివారం విజయవంతంగా భూమికి చేరింది. ఈ ప్రయోగం విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు జపాన్​ అంతరిక్ష కేంద్రం అధికారులు, శాస్త్రవేత్తలు. ఈ అద్భుత క్షణాల కోసం ఆరేళ్లు ఎదురుచూసినట్లు చెప్పారు. వాటిలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నామని వెల్లడించారు. ఇంతకీ.. ఈ నమూనాల ద్వారా ఏం తెలుసుకోనున్నారు? ఈ ప్రాజెక్టు ఏ విధంగా సాగింది?... ఓసారి పరిశీలిద్దాం.

asteroid samples
రియుగు గ్రహశకలంపై హయబుసా-2

ప్రాజెక్ట్​ సాగిందిలా..

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి నమూనాల సేకరణకు జపాన్​.. 2014లో హయబుసా-2 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. అది 2018లో ఆ ఖగోళ వస్తువును చేరింది. ఏడాదిన్నర పాటు అక్కడే ఉండి పరిశోధనలు సాగించింది. గత ఏడాది ఈ వ్యోమనౌక.. రియూగు ఉపరితలం, లోపలి పొరల నుంచి నమూనాలను సేకరించింది. అనంతరం విశ్వంలో ఏడాది పాటు ప్రయాణించి శనివారం.. భూమికి చేరువైంది. పుడమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. గ్రహశకల నమూనాలతో కూడిన క్యాప్యూల్​ను హయబుసా-2 విడిచిపెట్టింది. ఇది ఆదివారం తెల్లవారు జామున.. భూవాతావరణంలోకి (120 కిలోమీటర్ల ఎత్తులో) ప్రవేశించింది. గాలి రాపిడి వల్ల తలెత్తిన వేడితో అది అగ్నిగోళంగా మారింది. అయితే.. ఉష్ణకవచం సాయంతో ఈ దశను అధిగమించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు క్యాప్సూల్​లోని పారాషూట్​ విచ్చుకొని, వేగాన్ని తగ్గించింది.

ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనావాసాలు లేని ప్రాంతంలో ఆదివారం ఉదయం ల్యాండ్​ అయింది క్యాప్సూల్​. తాను దిగిన ప్రాంతాన్ని తెలియజేస్తూ జపాన్​ శాస్త్రవేత్తలకు సంకేతాలు పంపించింది. వీటిని అందుకోవడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో శాటిలైట్​ యాంటెన్నాలను ఏర్పాటు చేశారు. ల్యాండింగ్​ ఘట్టం కోసం 70 మందికిపైగా జపాన్​ శాస్త్రవేత్తలు కొద్ది రోజులుగా విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్యాప్సూల్​ వెడల్పు 40 సెంటీమీటర్లే. అందువల్ల రెండు గంటలపాటు గాలింపు జరిపిన అనంతరం హెలికాప్టర్​ బృందాలు దీన్ని సేకరించగలిగాయి.

asteroid samples
భూమిపై దిగిన క్యాప్సూల్​

ఈ క్యాప్యూల్​పై ఆస్ట్రేలియాలోని ఓ ల్యాబ్​లో ప్రాథమిక భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వచ్చేవారంలో జపాన్​కు తరలిస్తారు.

asteroid samples
ప్రత్యేక బాక్స్​లో భద్రపరిచిన క్యాప్సూల్​

శాస్త్రవేత్తల మాటేంటి?

గ్రహశకల నమూనాల విశ్లేషణ ద్వారా సౌర కుటుంబం, పుడమి పుట్టుక వివరాలతోపాటు జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలక అంశాలను వెలుగులోకి తీసుకురావొచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. రియూగు నమూనాలు.. 50 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాలోని ముర్చిసన్​లో పడిన ఒక ఉల్కను పోలి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉల్కలో సాధారణ జీవపదార్థాలైన అమైనో ఆమ్లాలతో పాటు పుష్కలంగా నీరు ఉందని చెప్పారు. రియూగు నమూనాల్లోనూ జీవ పదార్థాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

" అంతరిక్ష రేడియోధార్మికత, ఇతర వాతావరణ ప్రభావాలు లేని గ్రహశకల నమూనాల్లో విలువైన సమాచారం ఉందని భావిస్తున్నాం. సౌర వ్యవస్థలో పదార్థాలు ఎలా ఉంటాయి, భూమిపై జీవానికి ఎలా కారణమయ్యాయని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. నమూనాల పరిశీలనతో.. సౌర కుటుంబం మూలాలు, భూమికి నీరు ఎలా వచ్చింది అని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందనే మా నమ్మకం. "

- హిరోషి యమకావా, జపాన్​ అంతరిక్ష పరిశోధన కేంద్రం అధ్యక్షుడు.

మరిన్ని పరిశోధనలు..

క్యాప్సూల్​ను భూ వాతావరణంలో జారవిడిచిన హయబుసా-2 మరిన్ని పరిశోధనల దిశగా సాగుతోంది. 1998కేవై26 అనే గ్రహశకలం దిశగా వెలుతోంది. అక్కడికి చేరుకోవడానికి 10 ఏళ్ల సమయం పడుతుంది. ఉల్కలు భూమిని ఢీకొట్టకుండా నిరోధించే విధానాలపై ఇది పరిశోధన సాగించనుంది.

భవిష్యత్తు కోసం 40 శాతం నమూనాలు..

గ్రహశకల నమూనాలు కలుషితం కాకుండా క్లీన్​ రూమ్​లో వాటిని విశ్లేషిస్తామని జపాన్​ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆరునెలల పాటు వీటిపై పరిశోధనలు చేపడతామని.. ఆ తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సహా పలు కీలక అంతర్జాతీయ పరిశోధన బృందాలతోనూ పంచుకుంటామని తెలిపారు. అలాగే నమూనాల్లో 40 శాతాన్ని భవిష్యత్తు పరిశోధనల కోసం భద్రపరుస్తామన్నారు.

నాసా ప్రకటించిన కొద్ది వారాల్లోనే..

ప్రపంచంలోనే తొలిసారి గ్రహశకలం నమూనాలతో భూమికి క్యాప్యూల్​ను తిరిగి రప్పించిన దేశంగా రికార్డు సాధించింది జపాన్​. నాసాకు చెందిన ఓఎస్​ఐఆర్​ఐఎస్​-ఆర్​ఈఎక్స్​ వ్యోమనౌక విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై దిగి నమూనాలు సేకరించినట్లు ప్రకటించిన కొన్ని వారాల్లోనే ఈ క్యూప్సూల్​ భూమికి చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా సైతం చంద్రుడి ఉపరితలం, అంతర్గత పొరల్లోని నమూనాలను సేకరించి వ్యోమనౌకలో విజయవంతంగా భద్రపరిచినట్లు ఇటీవలే ప్రకటించింది.

ఇదీ చూడండి: రాళ్ల కోసం 'బెన్ను'పై దిగిన నాసా వ్యోమనౌక

సుదూర గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో జపాన్​ క్యాప్సూల్​ ఆదివారం విజయవంతంగా భూమికి చేరింది. ఈ ప్రయోగం విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు జపాన్​ అంతరిక్ష కేంద్రం అధికారులు, శాస్త్రవేత్తలు. ఈ అద్భుత క్షణాల కోసం ఆరేళ్లు ఎదురుచూసినట్లు చెప్పారు. వాటిలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నామని వెల్లడించారు. ఇంతకీ.. ఈ నమూనాల ద్వారా ఏం తెలుసుకోనున్నారు? ఈ ప్రాజెక్టు ఏ విధంగా సాగింది?... ఓసారి పరిశీలిద్దాం.

asteroid samples
రియుగు గ్రహశకలంపై హయబుసా-2

ప్రాజెక్ట్​ సాగిందిలా..

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి నమూనాల సేకరణకు జపాన్​.. 2014లో హయబుసా-2 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. అది 2018లో ఆ ఖగోళ వస్తువును చేరింది. ఏడాదిన్నర పాటు అక్కడే ఉండి పరిశోధనలు సాగించింది. గత ఏడాది ఈ వ్యోమనౌక.. రియూగు ఉపరితలం, లోపలి పొరల నుంచి నమూనాలను సేకరించింది. అనంతరం విశ్వంలో ఏడాది పాటు ప్రయాణించి శనివారం.. భూమికి చేరువైంది. పుడమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. గ్రహశకల నమూనాలతో కూడిన క్యాప్యూల్​ను హయబుసా-2 విడిచిపెట్టింది. ఇది ఆదివారం తెల్లవారు జామున.. భూవాతావరణంలోకి (120 కిలోమీటర్ల ఎత్తులో) ప్రవేశించింది. గాలి రాపిడి వల్ల తలెత్తిన వేడితో అది అగ్నిగోళంగా మారింది. అయితే.. ఉష్ణకవచం సాయంతో ఈ దశను అధిగమించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు క్యాప్సూల్​లోని పారాషూట్​ విచ్చుకొని, వేగాన్ని తగ్గించింది.

ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనావాసాలు లేని ప్రాంతంలో ఆదివారం ఉదయం ల్యాండ్​ అయింది క్యాప్సూల్​. తాను దిగిన ప్రాంతాన్ని తెలియజేస్తూ జపాన్​ శాస్త్రవేత్తలకు సంకేతాలు పంపించింది. వీటిని అందుకోవడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో శాటిలైట్​ యాంటెన్నాలను ఏర్పాటు చేశారు. ల్యాండింగ్​ ఘట్టం కోసం 70 మందికిపైగా జపాన్​ శాస్త్రవేత్తలు కొద్ది రోజులుగా విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్యాప్సూల్​ వెడల్పు 40 సెంటీమీటర్లే. అందువల్ల రెండు గంటలపాటు గాలింపు జరిపిన అనంతరం హెలికాప్టర్​ బృందాలు దీన్ని సేకరించగలిగాయి.

asteroid samples
భూమిపై దిగిన క్యాప్సూల్​

ఈ క్యాప్యూల్​పై ఆస్ట్రేలియాలోని ఓ ల్యాబ్​లో ప్రాథమిక భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వచ్చేవారంలో జపాన్​కు తరలిస్తారు.

asteroid samples
ప్రత్యేక బాక్స్​లో భద్రపరిచిన క్యాప్సూల్​

శాస్త్రవేత్తల మాటేంటి?

గ్రహశకల నమూనాల విశ్లేషణ ద్వారా సౌర కుటుంబం, పుడమి పుట్టుక వివరాలతోపాటు జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలక అంశాలను వెలుగులోకి తీసుకురావొచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. రియూగు నమూనాలు.. 50 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాలోని ముర్చిసన్​లో పడిన ఒక ఉల్కను పోలి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉల్కలో సాధారణ జీవపదార్థాలైన అమైనో ఆమ్లాలతో పాటు పుష్కలంగా నీరు ఉందని చెప్పారు. రియూగు నమూనాల్లోనూ జీవ పదార్థాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

" అంతరిక్ష రేడియోధార్మికత, ఇతర వాతావరణ ప్రభావాలు లేని గ్రహశకల నమూనాల్లో విలువైన సమాచారం ఉందని భావిస్తున్నాం. సౌర వ్యవస్థలో పదార్థాలు ఎలా ఉంటాయి, భూమిపై జీవానికి ఎలా కారణమయ్యాయని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. నమూనాల పరిశీలనతో.. సౌర కుటుంబం మూలాలు, భూమికి నీరు ఎలా వచ్చింది అని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందనే మా నమ్మకం. "

- హిరోషి యమకావా, జపాన్​ అంతరిక్ష పరిశోధన కేంద్రం అధ్యక్షుడు.

మరిన్ని పరిశోధనలు..

క్యాప్సూల్​ను భూ వాతావరణంలో జారవిడిచిన హయబుసా-2 మరిన్ని పరిశోధనల దిశగా సాగుతోంది. 1998కేవై26 అనే గ్రహశకలం దిశగా వెలుతోంది. అక్కడికి చేరుకోవడానికి 10 ఏళ్ల సమయం పడుతుంది. ఉల్కలు భూమిని ఢీకొట్టకుండా నిరోధించే విధానాలపై ఇది పరిశోధన సాగించనుంది.

భవిష్యత్తు కోసం 40 శాతం నమూనాలు..

గ్రహశకల నమూనాలు కలుషితం కాకుండా క్లీన్​ రూమ్​లో వాటిని విశ్లేషిస్తామని జపాన్​ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆరునెలల పాటు వీటిపై పరిశోధనలు చేపడతామని.. ఆ తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సహా పలు కీలక అంతర్జాతీయ పరిశోధన బృందాలతోనూ పంచుకుంటామని తెలిపారు. అలాగే నమూనాల్లో 40 శాతాన్ని భవిష్యత్తు పరిశోధనల కోసం భద్రపరుస్తామన్నారు.

నాసా ప్రకటించిన కొద్ది వారాల్లోనే..

ప్రపంచంలోనే తొలిసారి గ్రహశకలం నమూనాలతో భూమికి క్యాప్యూల్​ను తిరిగి రప్పించిన దేశంగా రికార్డు సాధించింది జపాన్​. నాసాకు చెందిన ఓఎస్​ఐఆర్​ఐఎస్​-ఆర్​ఈఎక్స్​ వ్యోమనౌక విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై దిగి నమూనాలు సేకరించినట్లు ప్రకటించిన కొన్ని వారాల్లోనే ఈ క్యూప్సూల్​ భూమికి చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా సైతం చంద్రుడి ఉపరితలం, అంతర్గత పొరల్లోని నమూనాలను సేకరించి వ్యోమనౌకలో విజయవంతంగా భద్రపరిచినట్లు ఇటీవలే ప్రకటించింది.

ఇదీ చూడండి: రాళ్ల కోసం 'బెన్ను'పై దిగిన నాసా వ్యోమనౌక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.