మయన్మార్లో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎశ్ తిరుమూర్తి తెలిపారు. మయన్మార్ నాయకత్వం ఐకమత్యంగా ఉండి వీలైనంత త్వరగా శాంతియుత పంథాలో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ వెల్లడించింది.
"భారతదేశం మయన్మార్తో భూమి, సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉంది. మయన్మార్లో ఇటీవల పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసేందుకు మయన్మార్ చేసిన కృషి నిర్వీర్యం కాకూడదు.
మయన్మార్, ఆ దేశ ప్రజలకు అత్యంత దగ్గరి స్నేహితుడిగా వారికి సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మాతో కలిసి వచ్చే దేశాలతో మయన్మార్ ప్రజల ఆశలను ఎల్లప్పుడూ మేం గౌరవిస్తాం."
- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి
సైన్యం హస్తగతం..
మయన్మార్ సైనిక బలగాలు తిరుగుబాటు చేసి ప్రభుత్వ పగ్గాల్ని చేజిక్కించుకున్నాయి. దేశంలో 2010లో ప్రారంభమైన పాక్షిక ప్రజాస్వామ్య ప్రభుత్వం తిరిగి నిరంకుశత్వం వైపు మళ్లింది. కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకి, అధ్యక్షులు ఉ విన్ మింట్తోపాటు, అధికార 'జాతీయ ప్రజాస్వామ్య లీగ్ (ఎన్ఎల్డీ)'కి చెందిన పలువురు సీనియర్ నేతలను బంధించారు.
- ఇదీ చూడండి: మయన్మార్ సైనిక చర్య- ప్రజాస్వామ్యానికి విఘాతం