ETV Bharat / international

కాబుల్​లో గురుద్వారాపై ఉగ్రదాడి- 27 మంది మృతి

author img

By

Published : Mar 25, 2020, 1:33 PM IST

Updated : Mar 25, 2020, 4:00 PM IST

Gunmen storm Sikh gurdwara in Afghanistan, killing 11 people and wounding as many
అఫ్ఘానిస్థాన్​లో బాంబు పేలుడు

15:58 March 25

27 మంది పౌరులు బలి- నలుగురు ముష్కరులు హతం

అఫ్గానిస్థాన్​​ కాబుల్​లోని సిక్కు గురుద్వారాపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 27మంది మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. నలుగురు ముష్కరుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

షోర్​బజార్​ ప్రాంతంలోని ఈ ప్రార్థనా మందిరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45కు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అక్కడ 150 మంది ఉన్నారు. మొత్తం నలుగురు ముష్కరులు తుపాకులతో విరుచుకుపడగా అఫ్గాన్​ బలగాలు దీటుగా ఎదుర్కొన్నాయి. అనేక గంటలపాటు శ్రమించి నలుగురినీ మట్టుబెట్టాయి.

ఐఎస్​ ప్రకటన..

గురుద్వారాపై దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. 

14:20 March 25

ఓ ముష్కరుడు హతం

అఫ్గానిస్థాన్​​ కాబుల్​లోని సిక్కు గురుద్వారాపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11మంది మృతిచెందారు. మరో 11మంది గాయపడ్డారు. 

షోర్​బజార్​ ప్రాంతంలోని ఈ ప్రార్థనా మందిరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45కు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అక్కడ 150 మంది ఉన్నారు. 

మొత్తం నలుగురు ముష్కరులు తుపాకులతో విరుచుకుపడగా అఫ్గాన్​ బలగాలు దీటుగా వారిని ఎదుర్కొన్నాయి. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మిగిలిన ముగ్గురికి, భద్రతా సిబ్బంది మధ్య ఇంకా పోరు కొనసాగుతోంది. 

ఐఎస్​ ప్రకటన..

గురుద్వారాపై దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. 

13:38 March 25

ఐఎస్​ పనే...

అఫ్గానిస్థాన్​ కాబుల్​లో ఘోరం జరిగింది. సిక్కు గురుద్వారాపై సాయుధ దుండగులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 

ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

13:31 March 25

అఫ్గానిస్థాన్​లో గురుద్వారాపై దాడి- 11 మంది మృతి

అఫ్గానిస్థాన్​లో ఘోరం జరిగింది. సిక్కు గురుద్వారాపై సాయుధ దుండగులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 

15:58 March 25

27 మంది పౌరులు బలి- నలుగురు ముష్కరులు హతం

అఫ్గానిస్థాన్​​ కాబుల్​లోని సిక్కు గురుద్వారాపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 27మంది మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. నలుగురు ముష్కరుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

షోర్​బజార్​ ప్రాంతంలోని ఈ ప్రార్థనా మందిరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45కు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అక్కడ 150 మంది ఉన్నారు. మొత్తం నలుగురు ముష్కరులు తుపాకులతో విరుచుకుపడగా అఫ్గాన్​ బలగాలు దీటుగా ఎదుర్కొన్నాయి. అనేక గంటలపాటు శ్రమించి నలుగురినీ మట్టుబెట్టాయి.

ఐఎస్​ ప్రకటన..

గురుద్వారాపై దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. 

14:20 March 25

ఓ ముష్కరుడు హతం

అఫ్గానిస్థాన్​​ కాబుల్​లోని సిక్కు గురుద్వారాపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11మంది మృతిచెందారు. మరో 11మంది గాయపడ్డారు. 

షోర్​బజార్​ ప్రాంతంలోని ఈ ప్రార్థనా మందిరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45కు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అక్కడ 150 మంది ఉన్నారు. 

మొత్తం నలుగురు ముష్కరులు తుపాకులతో విరుచుకుపడగా అఫ్గాన్​ బలగాలు దీటుగా వారిని ఎదుర్కొన్నాయి. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మిగిలిన ముగ్గురికి, భద్రతా సిబ్బంది మధ్య ఇంకా పోరు కొనసాగుతోంది. 

ఐఎస్​ ప్రకటన..

గురుద్వారాపై దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. 

13:38 March 25

ఐఎస్​ పనే...

అఫ్గానిస్థాన్​ కాబుల్​లో ఘోరం జరిగింది. సిక్కు గురుద్వారాపై సాయుధ దుండగులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 

ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

13:31 March 25

అఫ్గానిస్థాన్​లో గురుద్వారాపై దాడి- 11 మంది మృతి

అఫ్గానిస్థాన్​లో ఘోరం జరిగింది. సిక్కు గురుద్వారాపై సాయుధ దుండగులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 

Last Updated : Mar 25, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.