ETV Bharat / international

'మాల్యా 135 మిలియన్ డాలర్లు చెల్లించండి'

author img

By

Published : May 25, 2019, 7:38 PM IST

లిక్కర్ కింగ్​ విజయ్​ మాల్యా బ్రిటీష్​ పానీయాల దిగ్గజం డియాజియోకు... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశించింది.

'మాల్యా 135 మిలియన్ డాలర్లు చెల్లించండి'

పంజాబ్ నేషనల్​ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న... లిక్కర్​ టైకూన్ విజయ్ ​మాల్యాకు మరోసారి చుక్కెదురైంది. బ్రిటన్​కు చెందిన​ పానీయాల దిగ్గజం డియాజియోకు... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని యూకే హైకోర్టు ఆదేశించింది.

2016లో నోటి మాట ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. విజయ్​ మాల్యా 175 మిలియన్​ డాలర్ల మేర బకాయి పడ్డారని డియాజియో బ్రిటన్​ హైకోర్టులో పిటిషన్​ వేసింది. మూడేళ్ల కిందట మాల్యాకు చెందిన యునైటెడ్​ స్పిరిట్స్​ లిమిటెడ్​లో మెజారిటీ వాటా కొనుగోలు వ్యవహారంలో ఈ సొమ్ము తమకు తిరిగి చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది.

వాదనలు విన్న జస్టిస్​ రాబిన్​ తన తీర్పులో... 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని మాల్యా కంపెనీకి ఆదేశించారు. ఇందులో మాల్యా నుంచి నేరుగా 40 మిలియన్ డాలర్లు, ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్యా నుంచి మిగతా సొమ్ము వసూలు చేయాలని ఆదేశించారు. అయితే మాల్యా ఈ సొమ్ముకి వడ్డీతోపాటు, న్యాయప్రక్రియకైన ఖర్చులు 2 లక్షల పౌండ్లూ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: డ్రోన్ల డ్యాన్స్​తో ఆకాశంలో జిల్​జిల్ జిగాజిగా

పంజాబ్ నేషనల్​ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న... లిక్కర్​ టైకూన్ విజయ్ ​మాల్యాకు మరోసారి చుక్కెదురైంది. బ్రిటన్​కు చెందిన​ పానీయాల దిగ్గజం డియాజియోకు... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని యూకే హైకోర్టు ఆదేశించింది.

2016లో నోటి మాట ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. విజయ్​ మాల్యా 175 మిలియన్​ డాలర్ల మేర బకాయి పడ్డారని డియాజియో బ్రిటన్​ హైకోర్టులో పిటిషన్​ వేసింది. మూడేళ్ల కిందట మాల్యాకు చెందిన యునైటెడ్​ స్పిరిట్స్​ లిమిటెడ్​లో మెజారిటీ వాటా కొనుగోలు వ్యవహారంలో ఈ సొమ్ము తమకు తిరిగి చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది.

వాదనలు విన్న జస్టిస్​ రాబిన్​ తన తీర్పులో... 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని మాల్యా కంపెనీకి ఆదేశించారు. ఇందులో మాల్యా నుంచి నేరుగా 40 మిలియన్ డాలర్లు, ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్యా నుంచి మిగతా సొమ్ము వసూలు చేయాలని ఆదేశించారు. అయితే మాల్యా ఈ సొమ్ముకి వడ్డీతోపాటు, న్యాయప్రక్రియకైన ఖర్చులు 2 లక్షల పౌండ్లూ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: డ్రోన్ల డ్యాన్స్​తో ఆకాశంలో జిల్​జిల్ జిగాజిగా


Bhubaneswar (Odisha), May 25 (ANI): Biju Janata Dal (BJD) leader and winning candidate from Odisha's Puri, Pinaki Misra thanked the people of Odisha for showering affection towards him. Misra said, "I am very grateful that they showered me with so much affection. I've decided to give my entire salary and allowances from Parliament to CM Relief Fund so that it can be used for people of Puri."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.