ETV Bharat / international

భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!

author img

By

Published : Jun 29, 2020, 11:18 AM IST

చైనా తన పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమిస్తూ తన దేశ మ్యాప్​ను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంది. ఇప్పటి వరకు లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఇతర భూభాగాలను ఆక్రమించిన ఘనత చైనాకే దక్కుతుంది. దీని కోసం 'సలామీ స్లైసింగ్'​ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆ దేశ కన్ను భారత్​ మీద పడింది. భారత్​లోనూ ఇప్పటికే కొంత భాగాన్ని సొంతం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Chinese grand strategy of salami slicing continues in its periphery
పొరగు దేశాలపై చైనా క్యాబేజీ వ్యూహం..!

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా మార్చినన్ని సార్లు మ్యాప్‌ను మరే దేశం మార్చలేదంటే అంతిశయోక్తికాదేమో. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల ఇతర దేశాల భూభాగాల్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్‌కే దక్కుతుంది. ఎప్పటికప్పుడు కొత్తపాట పాడుతూ.. పొరుగు దేశాలతో పేచీలకు దిగడం ఎంతో కొంత భూభాగాన్ని దిగమింగడం డ్రాగన్‌కు అలావాటుగా మారిపోయింది. అదే సమయంలో యుద్ధాలు వచ్చే స్థాయిలో అక్రమణలకు దిగే ధైర్యం చేయదు. చిన్ని..చిన్న భూభాగాలను మెల్లగా తినేస్తుంది. సైనిక పరిభాషలో దీనిని ‘సలామీ స్లైసింగ్’ అంటారు. 2017లో నాటి ఆర్మీ చీఫ్‌.. నేటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఈ విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు కూడా.

అసలు సలామీ స్లైసింగ్‌ అంటే ఏమిటీ..?

1940 హంగేరియన్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాథ్యూరకోసీ ఈ పదాన్ని వాడాడు. ఎదుట పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట. దీనిని ‘క్యాబేజీ వ్యూహం’ అని కూడా అంటారు. పొరుగు దేశాల్లోని చిన్ని చిన్న ప్రాంతాలు తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైన ఉండొచ్చు. పొరుగు దేశం అభ్యంతరం చెబితే శాంతి చర్చలపేరుతో విదేశాంగశాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగానీ, భూభాగాలు వెనక్కి రావు. కిలోమీటర్‌ కోసమో.. కొన్ని వందల మీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకొంటోంది.

గల్వాన్‌ లోయా.. పాంగాంగ్‌ సో సరస్సు కూడా ఇలానే..

భారత్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్‌ సో సర్సుల వద్ద కూడా చైనా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. పాంగాంగ్‌ సోలోని ఫింగర్‌ 4 తమదే అని కొత్త వాదన అందుకొంది. వాస్తవానికి చైనా ఫింగర్ 8 వద్దే ఉండాలి. భారత్‌ ఫింగర్ 4 వరకు ఉండాలి. కానీ, ఫింగర్‌ 4 వద్ద వరకు వచ్చేందుకు భౌగోళికంగా అనుకూలంగా ఉండంతో చైనా దానిని వాడుకొని అక్కడకు వచ్చేసింది. భారత్‌ వైపు నుంచి ఫింగర్ 4 శిఖరానికి చేరడానికి నిట్టనిలువునా కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చైనా ఫింగర్‌ 4తనదే అనే వాదన తెరపైకి తెచ్చింది. ఇక గల్వాన్‌ లోయ గతంలో ఎప్పుడూ వివాదాస్పదంకాలేదు. అది పూర్తిగా భారత్‌ స్వాధీనంలోనే ఉంది. కానీ, భారత్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్డీకు రహదారి నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు గల్వాన్‌ లోయ కూడా తనదే అనే వాదన తెచ్చింది. గతంలో డోక్లాం కూడలి వద్ద కూడా ఇలాంటి సలామీ స్లైసింగ్‌కే ప్రయత్నించింది. కానీ, అప్పట్లో భారత్‌ గట్టిగా నిలబడటంతో తాత్కాలికంగా వెనుదిరిగింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌, లద్దాక్‌ వంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు సలామీ స్లైసింగ్‌కు పాల్పడుతూనే ఉంటోంది. 2013లో భారత్‌ 600 చదరపు కిలోమీటర్లను చైనాకు కోల్పోయిందని శ్యామ్‌శరణ్‌ నివేదిక వెల్లడించింది. ఆ భూభాగాన్ని చైనా సలామీ స్లైసింగ్‌ రూపంలోనే ఆక్రమించింది.

నమ్మిన నేపాల్‌ గొంతు కోస్తూ..

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం చైనాతో కుమ్మకై భారత్‌తో సరిహద్దు వివాదానికి కాలు దువ్వింది. ఇది జరిగి రోజులు గడవక ముందే నేపాల్‌కు చెందిన నాలుగు జిల్లాల్లో దాదాపు 28హెక్టార్ల వ్యూహాత్మక ప్రాంతాన్ని చైనా బలగాలు ఆక్రమించినట్లు ఆ దేశ ఏజెన్సీలే ప్రకటించాయి. అసలు నేపాల్‌, భూటాన్‌లే తమ టిబెట్‌లోని అంతర్భాగాలని చైనా ప్రకటించింది. 1962 తర్వాత ప్రఖ్యాత గోర్‌ఖా జిల్లాలోని ఓ గ్రామాన్ని కబ్జా చేసింది. ఈ విషయం అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా అక్కడ 34, 35, 36, 37, 38 పిల్లర్లను మార్చేసింది. ఈ విషయంపై నేపాల్‌ ప్రభుత్వం కిమ్మనలేదు. అసలు 2019 వరకు ఏ ప్రభుత్వ అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు భారత్‌తో విరోధం పెట్టుకోవడంతో చైనాను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.

మరికొన్ని ప్రదేశాల్లో..

దక్షిణ చైనా సముద్రంలో దీవులను ఇలానే ఆక్రమించింది. 1974లో పరాసల్‌ ద్వీపం, 1988లో జాన్సన్‌ రీఫ్‌, 1995లో మిస్‌చెఫ్‌ రీఫ్‌, 2012లో షోల్‌ ఇలా చెప్పుకొంటూ చాలా ఉన్నాయి. కేవలం భారత్‌ మాత్రమే చైనా సలామీ స్లైస్‌ను కొంత బలంగా అడ్డుకొంది. ఇటీవల గల్వాన్ లోయలో చైనా సైనికులకు బలంగా బుద్ధిచెప్పడంతో మళ్లీ చర్చలు అంటూ కొత్తరాగం అందుకొంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా మార్చినన్ని సార్లు మ్యాప్‌ను మరే దేశం మార్చలేదంటే అంతిశయోక్తికాదేమో. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల ఇతర దేశాల భూభాగాల్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్‌కే దక్కుతుంది. ఎప్పటికప్పుడు కొత్తపాట పాడుతూ.. పొరుగు దేశాలతో పేచీలకు దిగడం ఎంతో కొంత భూభాగాన్ని దిగమింగడం డ్రాగన్‌కు అలావాటుగా మారిపోయింది. అదే సమయంలో యుద్ధాలు వచ్చే స్థాయిలో అక్రమణలకు దిగే ధైర్యం చేయదు. చిన్ని..చిన్న భూభాగాలను మెల్లగా తినేస్తుంది. సైనిక పరిభాషలో దీనిని ‘సలామీ స్లైసింగ్’ అంటారు. 2017లో నాటి ఆర్మీ చీఫ్‌.. నేటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఈ విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు కూడా.

అసలు సలామీ స్లైసింగ్‌ అంటే ఏమిటీ..?

1940 హంగేరియన్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాథ్యూరకోసీ ఈ పదాన్ని వాడాడు. ఎదుట పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట. దీనిని ‘క్యాబేజీ వ్యూహం’ అని కూడా అంటారు. పొరుగు దేశాల్లోని చిన్ని చిన్న ప్రాంతాలు తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైన ఉండొచ్చు. పొరుగు దేశం అభ్యంతరం చెబితే శాంతి చర్చలపేరుతో విదేశాంగశాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగానీ, భూభాగాలు వెనక్కి రావు. కిలోమీటర్‌ కోసమో.. కొన్ని వందల మీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకొంటోంది.

గల్వాన్‌ లోయా.. పాంగాంగ్‌ సో సరస్సు కూడా ఇలానే..

భారత్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్‌ సో సర్సుల వద్ద కూడా చైనా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. పాంగాంగ్‌ సోలోని ఫింగర్‌ 4 తమదే అని కొత్త వాదన అందుకొంది. వాస్తవానికి చైనా ఫింగర్ 8 వద్దే ఉండాలి. భారత్‌ ఫింగర్ 4 వరకు ఉండాలి. కానీ, ఫింగర్‌ 4 వద్ద వరకు వచ్చేందుకు భౌగోళికంగా అనుకూలంగా ఉండంతో చైనా దానిని వాడుకొని అక్కడకు వచ్చేసింది. భారత్‌ వైపు నుంచి ఫింగర్ 4 శిఖరానికి చేరడానికి నిట్టనిలువునా కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చైనా ఫింగర్‌ 4తనదే అనే వాదన తెరపైకి తెచ్చింది. ఇక గల్వాన్‌ లోయ గతంలో ఎప్పుడూ వివాదాస్పదంకాలేదు. అది పూర్తిగా భారత్‌ స్వాధీనంలోనే ఉంది. కానీ, భారత్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్డీకు రహదారి నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు గల్వాన్‌ లోయ కూడా తనదే అనే వాదన తెచ్చింది. గతంలో డోక్లాం కూడలి వద్ద కూడా ఇలాంటి సలామీ స్లైసింగ్‌కే ప్రయత్నించింది. కానీ, అప్పట్లో భారత్‌ గట్టిగా నిలబడటంతో తాత్కాలికంగా వెనుదిరిగింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌, లద్దాక్‌ వంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు సలామీ స్లైసింగ్‌కు పాల్పడుతూనే ఉంటోంది. 2013లో భారత్‌ 600 చదరపు కిలోమీటర్లను చైనాకు కోల్పోయిందని శ్యామ్‌శరణ్‌ నివేదిక వెల్లడించింది. ఆ భూభాగాన్ని చైనా సలామీ స్లైసింగ్‌ రూపంలోనే ఆక్రమించింది.

నమ్మిన నేపాల్‌ గొంతు కోస్తూ..

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం చైనాతో కుమ్మకై భారత్‌తో సరిహద్దు వివాదానికి కాలు దువ్వింది. ఇది జరిగి రోజులు గడవక ముందే నేపాల్‌కు చెందిన నాలుగు జిల్లాల్లో దాదాపు 28హెక్టార్ల వ్యూహాత్మక ప్రాంతాన్ని చైనా బలగాలు ఆక్రమించినట్లు ఆ దేశ ఏజెన్సీలే ప్రకటించాయి. అసలు నేపాల్‌, భూటాన్‌లే తమ టిబెట్‌లోని అంతర్భాగాలని చైనా ప్రకటించింది. 1962 తర్వాత ప్రఖ్యాత గోర్‌ఖా జిల్లాలోని ఓ గ్రామాన్ని కబ్జా చేసింది. ఈ విషయం అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా అక్కడ 34, 35, 36, 37, 38 పిల్లర్లను మార్చేసింది. ఈ విషయంపై నేపాల్‌ ప్రభుత్వం కిమ్మనలేదు. అసలు 2019 వరకు ఏ ప్రభుత్వ అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు భారత్‌తో విరోధం పెట్టుకోవడంతో చైనాను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.

మరికొన్ని ప్రదేశాల్లో..

దక్షిణ చైనా సముద్రంలో దీవులను ఇలానే ఆక్రమించింది. 1974లో పరాసల్‌ ద్వీపం, 1988లో జాన్సన్‌ రీఫ్‌, 1995లో మిస్‌చెఫ్‌ రీఫ్‌, 2012లో షోల్‌ ఇలా చెప్పుకొంటూ చాలా ఉన్నాయి. కేవలం భారత్‌ మాత్రమే చైనా సలామీ స్లైస్‌ను కొంత బలంగా అడ్డుకొంది. ఇటీవల గల్వాన్ లోయలో చైనా సైనికులకు బలంగా బుద్ధిచెప్పడంతో మళ్లీ చర్చలు అంటూ కొత్తరాగం అందుకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.