ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించగలిగే తొలి మానవరహిత చైనా హెలికాప్టర్ డ్రోన్ ఆకాశంలోకి ఎగిరింది. కాల్పులు జరపడం, ఎత్తు నుంచి నిఘా పెట్టడం వంటివి దీని ప్రత్యేకతలు. చైనా ఈ చాపర్ను భారత సరిహద్దు వెంబడి మోహరించే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది.
మానవరహిత ఏఆర్500సీ హెలికాప్టర్.. టిబెట్లో భారత్తో ఉన్న చైనా సరిహద్దు భద్రతకు సహాయపడుతుందని ఆ దేశ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
గత బుధవారం.. తూర్పు చైనాలోని జింగ్షీ రాష్ట్రం నుంచి చేసిన ఈ డ్రోన్ ప్రయోగం విజయవంతమైంది. ఈ హెలికాప్టర్ను ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) రూపొందించింది.
5,000 మీటర్ల ఎత్తు నుంచి దీనిని టేక్ ఆఫ్ చేయవచ్చు. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఐదు గంటల పాటు నిర్విరామంగా ఎగురుతుందీ చాపర్. 500కేజీల బరువును మోయగలదు.
నిఘా, సమాచార పంపిణీ దీని ముఖ్య లక్ష్యం. అయితే దీనికి అదనపు పరికరాలు జోడిస్తే.. కాల్పులు జరపడానికి, కార్గో సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.
భారత్తో సరిహద్దు వెంబడి ఉద్రిక్తత వాతావరణ నెలకొన్న తరుణంలో చైనాకు ఈ చాపర్ అందుబాటులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.