ETV Bharat / international

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సరిహద్దులో ఉద్రిక్తత

author img

By

Published : Sep 10, 2020, 9:08 AM IST

Updated : Sep 10, 2020, 9:38 AM IST

భారత్​-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారుతున్నాయి. భారత్​ను రెచ్చగొట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది డ్రాగన్​. పాంగాంగ్‌కు ఉత్తరాన నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. దక్షిణ తీరంలో బలగాల సంఖ్యను చైనా గణనీయంగా పెంచుకుంటోంది. అయితే భారత్​ ఏమీ చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఎల్‌ఏసీ సమీపంలో భారత యుద్ధ విమానాలను చక్కర్లు కొట్టిస్తూ పరోక్షంగా హెచ్చరికలు పంపిస్తుంది.

China starts fresh build-up north of Pangong Lake
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సరిహద్దులో ఉద్రిక్తత

సరిహద్దుల్లో వేడి రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. భారత్‌, చైనా మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయికి చేరుకుంటున్నాయి! ద్వైపాక్షిక ఒప్పందాలను కాలరాస్తూ ఇప్పటికే సరిహద్దుల్లో కాల్పుల మోత మోగించిన డ్రాగన్‌.. తాజాగా పాంగాంగ్‌ సరస్సు వద్ద భారీగా బలగాలను మోహరించింది. అక్కడికి బరిసెలు, ఇనుప ముళ్లతో కూడిన కర్రలు, పదునైన కత్తుల వంటి ఆయుధాలనూ గణనీయంగా తరలిస్తూ భారత్‌ను తీవ్రంగా రెచ్చగొడుతోంది. చైనా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా అంతే దీటుగా బదులివ్వాలని ఇప్పటికే తీర్మానించుకున్న మన సైన్యం కూడా తదనుగుణంగా చర్యలు చేపడుతోంది. పాంగాంగ్‌ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తోంది. సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలను ఎల్‌ఏసీకి సమీపంలో చక్కర్లు కొట్టిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తామేమీ చేతులు కట్టుకొని కూర్చోలేదని.. ఢీ అంటే ఢీ అని.. డ్రాగన్‌కు పరోక్షంగా హెచ్చరికలు పంపిస్తోంది. మరోవైపు- భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఘర్షణగా మారే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం తలెత్తే పరిస్థితులు మాత్రం లేవని స్పష్టం చేశాయి.

పాంగాంగ్‌కు ఉత్తరాన ప్రధానంగా ఫింగర్‌-3 ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) కదలికలు మంగళవారం రాత్రి నుంచి బాగా పెరిగాయి. అధిక సంఖ్యలో బలగాలను అక్కడికి రప్పించిన డ్రాగన్‌.. కొత్తగా తాత్కాలిక స్థావరాలను ఏర్పాటుచేసింది. పాంగాంగ్‌కు దక్షిణాన ఎల్‌ఏసీకి కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే చైనా ట్రక్కులు, టెంట్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా తూర్పు లద్దాఖ్‌లో చైనా ప్రస్తుతం 50 వేల మంది సైనికులు, 150 యుద్ధ విమానాలు, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు, రాకెట్లను మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే పలు ఎత్తయిన ప్రాంతాలపై పాగా వేసిన భారత సైన్యం.. పీఎల్‌ఏ కదలికలను స్పష్టంగా చూడగలుగుతోంది. పాంగాంగ్‌ వద్ద ఇరు దేశాల బలగాలు పరస్పరం నేరుగా చూసుకునేంత దగ్గరగా చేరుకున్నాయని.. అయితే- ఎవరూ ఎల్‌ఏసీని దాటలేదని భారత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఘర్షణలేవీ చోటుచేసుకోలేదని కూడా స్పష్టం చేశారు. పాంగాంగ్‌కు ఉత్తరాన నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. దక్షిణ తీరంలో బలగాల సంఖ్యను చైనా గణనీయంగా పెంచుకుంటోంది.

దూరం 200 మీటర్లే

పాంగాంగ్‌కు దక్షిణాన కనీసం నాలుగు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం చాలా సమీపానికి చేరుకున్నాయి. వాటి మధ్య ప్రస్తుతం కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. రెజాంగ్‌ లా పర్వత మార్గంలో ఇరు దేశాల బలగాల మధ్య దూరం కేవలం 200 మీటర్లే.

China starts fresh build-up north of Pangong Lake
పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా చైనా దుస్సాహసం!

ఏం జరుగుతుందో చెప్పలేం

భారత్‌-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితులకైనా దారి తీయొచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ఘర్షణ తలెత్తే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే- ప్రస్తుత ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసేంత స్థాయిలో మాత్రం లేవని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికైతే కవ్వింపులు మాత్రమే కనిపిస్తున్నట్లు తెలిపాయి.

మరిన్ని ఘర్షణలు ఖాయం!

వచ్చే కొన్ని వారాలు లేదా నెలలపాటు భారత్‌, చైనా బలగాల మధ్య స్వల్ప స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెల 29న పాంగాంగ్‌కు దక్షిణాన పర్వత ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నించినప్పుడు తలెత్తిన ఘర్షణ వంటివి మరిన్ని చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పాయి. ‘‘చర్చలు కొనసాగుతున్నప్పటికీ డ్రాగన్‌ మన బలగాల్ని మున్ముందు మరింతగా రెచ్చగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే- ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

చైనా అగ్ర నాయకత్వం కనుసన్నల్లోనే..

పీఎల్‌ఏ కదలికలను ప్రస్తుతం స్థానిక కమాండర్లు, పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ కాకుండా చైనా అత్యున్నత నాయకత్వం నేరుగా నియంత్రిస్తున్నట్లు విస్పష్టంగా తెలుస్తోందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. "చైనాను విశ్వసించలేం. ఆ దేశానికి చెందిన కమాండర్‌ చుషుల్‌లో గత నెల 29న మన దేశ కమాండర్‌తో మాట్లాడారు. రాత్రివేళల్లో బలగాల కదలికలు చోటుచేసుకోకూడదన్న ఒప్పందం గురించి చర్చించారు. కానీ, అదే రోజు రాత్రి భారత స్థావరాలవైపు డ్రాగన్‌ బలగాలు దూసుకొచ్చాయి" అని వివరించారు. సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని ఓ అధికారి చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లోని రెజాంగ్‌-లా రిడ్జ్‌లైన్‌లో ఉన్న భారత స్థావరానికి సమీపంలో 30-40 మంది పీఎల్‌ఏ సైనికులు మోహరించి ఉన్నారని తెలిపారు.

భారత్‌ కూడా దీటుగా...

ఫింగర్‌-3 ప్రాంతంలో డ్రాగన్‌ భారీగా బలగాలను మోహరించడంతో భారత్‌ అప్రమత్తమైంది. అధిక సంఖ్యలో సైనికులను అక్కడికి చేర్చింది. సరిహద్దు బలగాలన్నింటికీ అత్యధిక స్థాయి అప్రమత్తత ప్రకటించింది. ఎల్‌ఏసీకి సమీపంలో సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు- పాంగాంగ్‌కు దక్షిణాన మన బలగాలు మరింత పట్టుబిగించాయి. అక్కడి రెచిన్‌ లా సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తున కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేశాయి. ఉపగ్రహ చిత్రాల్లో ఈ శిబిరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డ్రాగన్‌ శిబిరాలు అక్కడికి కొద్ది దూరంలో కేవలం నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయి. దీంతో చైనా బలగాల కదలికలను మన సైనికులు మెరుగ్గా గమనించగలుగుతున్నారు.

బాంబర్లు.. పారాట్రూపర్లు..

భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పీఠభూమి ప్రాంతానికి చైనా భారీగా బలగాలు, ఆయుధ సామగ్రిని చేరవేస్తోంది. బాంబర్లు, గగనతల రక్షణ బలగాలు, శతఘ్నులు, పారాట్రూపర్లు, పదాతి దళాలు, ప్రత్యేక బలగాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి తరలిస్తోంది. పీఎల్‌ఏ సెంట్రల్‌ థియేటర్‌ కమాండ్‌కు అనుసంధానమై ఉన్న హెచ్‌-6 బాంబర్లు, వై-20 రవాణా విమానం వంటి వాటిని శిక్షణ కార్యక్రమాల కోసం పీఠభూమి ప్రాంతంలో మోహరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: హిమాలయ నదుల్లోని ఆ చేపలకు కష్టకాలం

సరిహద్దుల్లో వేడి రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. భారత్‌, చైనా మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయికి చేరుకుంటున్నాయి! ద్వైపాక్షిక ఒప్పందాలను కాలరాస్తూ ఇప్పటికే సరిహద్దుల్లో కాల్పుల మోత మోగించిన డ్రాగన్‌.. తాజాగా పాంగాంగ్‌ సరస్సు వద్ద భారీగా బలగాలను మోహరించింది. అక్కడికి బరిసెలు, ఇనుప ముళ్లతో కూడిన కర్రలు, పదునైన కత్తుల వంటి ఆయుధాలనూ గణనీయంగా తరలిస్తూ భారత్‌ను తీవ్రంగా రెచ్చగొడుతోంది. చైనా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా అంతే దీటుగా బదులివ్వాలని ఇప్పటికే తీర్మానించుకున్న మన సైన్యం కూడా తదనుగుణంగా చర్యలు చేపడుతోంది. పాంగాంగ్‌ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తోంది. సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలను ఎల్‌ఏసీకి సమీపంలో చక్కర్లు కొట్టిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తామేమీ చేతులు కట్టుకొని కూర్చోలేదని.. ఢీ అంటే ఢీ అని.. డ్రాగన్‌కు పరోక్షంగా హెచ్చరికలు పంపిస్తోంది. మరోవైపు- భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఘర్షణగా మారే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం తలెత్తే పరిస్థితులు మాత్రం లేవని స్పష్టం చేశాయి.

పాంగాంగ్‌కు ఉత్తరాన ప్రధానంగా ఫింగర్‌-3 ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) కదలికలు మంగళవారం రాత్రి నుంచి బాగా పెరిగాయి. అధిక సంఖ్యలో బలగాలను అక్కడికి రప్పించిన డ్రాగన్‌.. కొత్తగా తాత్కాలిక స్థావరాలను ఏర్పాటుచేసింది. పాంగాంగ్‌కు దక్షిణాన ఎల్‌ఏసీకి కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే చైనా ట్రక్కులు, టెంట్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా తూర్పు లద్దాఖ్‌లో చైనా ప్రస్తుతం 50 వేల మంది సైనికులు, 150 యుద్ధ విమానాలు, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు, రాకెట్లను మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే పలు ఎత్తయిన ప్రాంతాలపై పాగా వేసిన భారత సైన్యం.. పీఎల్‌ఏ కదలికలను స్పష్టంగా చూడగలుగుతోంది. పాంగాంగ్‌ వద్ద ఇరు దేశాల బలగాలు పరస్పరం నేరుగా చూసుకునేంత దగ్గరగా చేరుకున్నాయని.. అయితే- ఎవరూ ఎల్‌ఏసీని దాటలేదని భారత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఘర్షణలేవీ చోటుచేసుకోలేదని కూడా స్పష్టం చేశారు. పాంగాంగ్‌కు ఉత్తరాన నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. దక్షిణ తీరంలో బలగాల సంఖ్యను చైనా గణనీయంగా పెంచుకుంటోంది.

దూరం 200 మీటర్లే

పాంగాంగ్‌కు దక్షిణాన కనీసం నాలుగు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం చాలా సమీపానికి చేరుకున్నాయి. వాటి మధ్య ప్రస్తుతం కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. రెజాంగ్‌ లా పర్వత మార్గంలో ఇరు దేశాల బలగాల మధ్య దూరం కేవలం 200 మీటర్లే.

China starts fresh build-up north of Pangong Lake
పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా చైనా దుస్సాహసం!

ఏం జరుగుతుందో చెప్పలేం

భారత్‌-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితులకైనా దారి తీయొచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ఘర్షణ తలెత్తే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే- ప్రస్తుత ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసేంత స్థాయిలో మాత్రం లేవని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికైతే కవ్వింపులు మాత్రమే కనిపిస్తున్నట్లు తెలిపాయి.

మరిన్ని ఘర్షణలు ఖాయం!

వచ్చే కొన్ని వారాలు లేదా నెలలపాటు భారత్‌, చైనా బలగాల మధ్య స్వల్ప స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెల 29న పాంగాంగ్‌కు దక్షిణాన పర్వత ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నించినప్పుడు తలెత్తిన ఘర్షణ వంటివి మరిన్ని చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పాయి. ‘‘చర్చలు కొనసాగుతున్నప్పటికీ డ్రాగన్‌ మన బలగాల్ని మున్ముందు మరింతగా రెచ్చగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే- ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

చైనా అగ్ర నాయకత్వం కనుసన్నల్లోనే..

పీఎల్‌ఏ కదలికలను ప్రస్తుతం స్థానిక కమాండర్లు, పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ కాకుండా చైనా అత్యున్నత నాయకత్వం నేరుగా నియంత్రిస్తున్నట్లు విస్పష్టంగా తెలుస్తోందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. "చైనాను విశ్వసించలేం. ఆ దేశానికి చెందిన కమాండర్‌ చుషుల్‌లో గత నెల 29న మన దేశ కమాండర్‌తో మాట్లాడారు. రాత్రివేళల్లో బలగాల కదలికలు చోటుచేసుకోకూడదన్న ఒప్పందం గురించి చర్చించారు. కానీ, అదే రోజు రాత్రి భారత స్థావరాలవైపు డ్రాగన్‌ బలగాలు దూసుకొచ్చాయి" అని వివరించారు. సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని ఓ అధికారి చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లోని రెజాంగ్‌-లా రిడ్జ్‌లైన్‌లో ఉన్న భారత స్థావరానికి సమీపంలో 30-40 మంది పీఎల్‌ఏ సైనికులు మోహరించి ఉన్నారని తెలిపారు.

భారత్‌ కూడా దీటుగా...

ఫింగర్‌-3 ప్రాంతంలో డ్రాగన్‌ భారీగా బలగాలను మోహరించడంతో భారత్‌ అప్రమత్తమైంది. అధిక సంఖ్యలో సైనికులను అక్కడికి చేర్చింది. సరిహద్దు బలగాలన్నింటికీ అత్యధిక స్థాయి అప్రమత్తత ప్రకటించింది. ఎల్‌ఏసీకి సమీపంలో సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు- పాంగాంగ్‌కు దక్షిణాన మన బలగాలు మరింత పట్టుబిగించాయి. అక్కడి రెచిన్‌ లా సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తున కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేశాయి. ఉపగ్రహ చిత్రాల్లో ఈ శిబిరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డ్రాగన్‌ శిబిరాలు అక్కడికి కొద్ది దూరంలో కేవలం నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయి. దీంతో చైనా బలగాల కదలికలను మన సైనికులు మెరుగ్గా గమనించగలుగుతున్నారు.

బాంబర్లు.. పారాట్రూపర్లు..

భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పీఠభూమి ప్రాంతానికి చైనా భారీగా బలగాలు, ఆయుధ సామగ్రిని చేరవేస్తోంది. బాంబర్లు, గగనతల రక్షణ బలగాలు, శతఘ్నులు, పారాట్రూపర్లు, పదాతి దళాలు, ప్రత్యేక బలగాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి తరలిస్తోంది. పీఎల్‌ఏ సెంట్రల్‌ థియేటర్‌ కమాండ్‌కు అనుసంధానమై ఉన్న హెచ్‌-6 బాంబర్లు, వై-20 రవాణా విమానం వంటి వాటిని శిక్షణ కార్యక్రమాల కోసం పీఠభూమి ప్రాంతంలో మోహరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: హిమాలయ నదుల్లోని ఆ చేపలకు కష్టకాలం

Last Updated : Sep 10, 2020, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.