ETV Bharat / international

చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!

author img

By

Published : Sep 24, 2020, 9:46 PM IST

వాయువ్య జిన్జియాంగ్​ ప్రాంతంలో మైనారిటీలైన ఉయ్​గర్ల అణిచివేతకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం చైనా ప్రభుత్వం 380 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాలను ఆస్ట్రేలియాకు చెందిన ఓసంస్థ తమ నివేదికలో వెల్లడించింది.

internment camps in Xinjiang
చైనాలోని ఉయ్​గర్ల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!

జిన్జియాంగ్​ ప్రాంతంలోని ఉయ్​గర్లపై అణిచివేత ధోరణి అవలంబిస్తూ.. అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది చైనా. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 380 అనుమానాస్పద నిర్బంధ కేంద్రాలను గుర్తించినట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్​ పాలసీ ఇన్​స్టిట్యూట్​(ఏఎస్​పీఐ).. 'ద జిన్జియాంగ్​ డేటా ప్రాజెక్ట్​' పేరుతో నివేదిక రూపొందించింది. 2017 నుంచి కొత్త వాటిని నిర్మించటం, ఉన్నవాటిని విస్తరించటం వంటి విస్తృత చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

  • PROJECT LAUNCH📢

    Today ASPI launches 'The Xinjiang Data Project' mapping Xinjiang’s detention system with 380 sites of suspected re-education camps, detention centres and prisons that have been built or expanded since 2017. View the interactive map ➡️ https://t.co/iykruAT4PP pic.twitter.com/xpNphYlhwI

    — ASPI (@ASPI_org) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇటీవలే జిన్జియాంగ్​ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైనారిటీలను నిర్బంధించటంపై.. చైనాను ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఉయ్​గర్లపై మతపరమైన, సాంస్కృతిక దాడులు సహా వారి నమ్మకాలను నిషేధించటం, వారిపై నిఘా, మహిళలకు బలవంతపు గర్భవిచ్ఛిత్తి వంటి చర్యలను ఎప్పటికప్పుడు పలు దేశాలు ఎత్తిచూపుతున్నాయి.

ఉయ్​గర్​ ముస్లింల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థించుకున్న చైనా.. వాటి ద్వారా 2014 నుంచి సగటున 1.3 మిలియన్ల మంది తిరిగి విద్యాభ్యాసం చేసినట్లు తెలిపింది. షి జిన్​పింగ్​ ప్రభుత్వం.. కొద్ది రోజుల క్రితం జిన్జియాంగ్​లో ఉపాధి, కార్మిక హక్కుల పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శిబిరాలను వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా పేర్కొన్న చైనా.. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ప్రయత్నాలు అవసరమని పేర్కొంది.

ఇదీ చూడండి: కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్​కు తలవంపులు!

జిన్జియాంగ్​ ప్రాంతంలోని ఉయ్​గర్లపై అణిచివేత ధోరణి అవలంబిస్తూ.. అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది చైనా. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 380 అనుమానాస్పద నిర్బంధ కేంద్రాలను గుర్తించినట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్​ పాలసీ ఇన్​స్టిట్యూట్​(ఏఎస్​పీఐ).. 'ద జిన్జియాంగ్​ డేటా ప్రాజెక్ట్​' పేరుతో నివేదిక రూపొందించింది. 2017 నుంచి కొత్త వాటిని నిర్మించటం, ఉన్నవాటిని విస్తరించటం వంటి విస్తృత చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

  • PROJECT LAUNCH📢

    Today ASPI launches 'The Xinjiang Data Project' mapping Xinjiang’s detention system with 380 sites of suspected re-education camps, detention centres and prisons that have been built or expanded since 2017. View the interactive map ➡️ https://t.co/iykruAT4PP pic.twitter.com/xpNphYlhwI

    — ASPI (@ASPI_org) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇటీవలే జిన్జియాంగ్​ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైనారిటీలను నిర్బంధించటంపై.. చైనాను ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఉయ్​గర్లపై మతపరమైన, సాంస్కృతిక దాడులు సహా వారి నమ్మకాలను నిషేధించటం, వారిపై నిఘా, మహిళలకు బలవంతపు గర్భవిచ్ఛిత్తి వంటి చర్యలను ఎప్పటికప్పుడు పలు దేశాలు ఎత్తిచూపుతున్నాయి.

ఉయ్​గర్​ ముస్లింల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థించుకున్న చైనా.. వాటి ద్వారా 2014 నుంచి సగటున 1.3 మిలియన్ల మంది తిరిగి విద్యాభ్యాసం చేసినట్లు తెలిపింది. షి జిన్​పింగ్​ ప్రభుత్వం.. కొద్ది రోజుల క్రితం జిన్జియాంగ్​లో ఉపాధి, కార్మిక హక్కుల పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శిబిరాలను వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా పేర్కొన్న చైనా.. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ప్రయత్నాలు అవసరమని పేర్కొంది.

ఇదీ చూడండి: కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్​కు తలవంపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.