అఫ్గానిస్థాన్లోని దక్షిణ జాబుల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కందహార్, కాబుల్ మధ్య రహదారిపై ఈ ఘటన జరిగింది.
రంజాన్ సెలవుల సందర్భంగా.. దక్షిణ హెల్మాండ్ రాష్ట్రం నుంచి కార్మికులతో గురువారం బయల్దేరిన మినీవ్యాన్.. దక్షిణ జాబుల్లో ట్రక్కును ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో.. డ్రైవర్ సహా 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: భారత్కు టీకా సాయంలో పంతం వీడని అమెరికా!
ఇదీ చూడండి: ఎవరెస్టు పర్వతాన్నీ వదలని కరోనా!