ETV Bharat / international

'భారత్​లో 9కోట్ల మందికి ఆ సౌకర్యాలు లేవు'

author img

By

Published : Oct 15, 2020, 10:47 PM IST

మధ్య, దక్షిణాసియాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే 15కోట్ల మందికిపైగా ప్రజలకు చేతులు శుభ్రపరుచుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని పేర్కొంది యూనెసెఫ్‌. భారత్​లోని పట్టణాల్లో నివసించే 9కోట్ల మందికిపైగా ప్రజలకు ఇళ్లల్లో చేతులు కడుక్కునేందుకు నీరు, సబ్బు వంటివి అందుబాటులో లేవని 'అంతర్జాతీయ హ్యాండ్‌ వాష్‌ డే' సందర్భంగా పేర్కొంది.

91 million urban Indians lack basic handwashing facilities at home: UNICEF
'భారత్​లో 9కోట్ల మందికి కనీస సౌకర్యాల లేమి'

భారత దేశంలోని పట్టణాల్లో నివసించేవారిలో సుమారు 9కోట్ల మందికి.. ఇళ్లల్లో చేతులు శుభ్రపరుచుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని యూనిసెఫ్ పేర్కొంది​. ఈ మేరకు 'అంతర్జాతీయ హ్యాండ్‌ వాష్‌ డే' సందర్భంగా.. విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కరోనా వేళ ఈ సమస్య మరింత పెరిగిందని తెలిపింది.

22శాతం మందికి..

మధ్య, దక్షిణ ఆసియా పట్టణాల్లో నివసించే 22శాతం మంది ప్రజలకు చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీరు వంటి సదుపాయాలు అందుబాటులో లేవని యూనిసెఫ్​ నివేదిక స్పష్టం చేసింది. బంగ్లాదేశ్​లో సుమారు 2కోట్ల 90లక్షల మంది పట్టణ ప్రజలు కూడా ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరుచుకోవటం గుర్తుంచుకోవాలని, ఇది సామాజిక బాధ్యతని యూనెసెఫ్‌ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్‌ యాస్మిన్‌ ఆలీ హక్‌ అన్నారు. లేని పక్షంలో కొవిడ్​ మరింత విజృంభిస్తుందని ఆయన హెచ్చరించారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కరోనాలాంటి మరెన్ని వైరస్​లను అడ్డుకోవచ్చని గుర్తుచేశారు యాస్మిన్​.

ఐదుగురిలో ముగ్గురికే..

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో ముగ్గురికి మాత్రమే చేతులు శుభ్రపరుచుకునే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని.. పిల్లల హక్కుల నివేదిక వెల్లడిస్తోందని యూనెసెఫ్‌ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ 10 పాఠశాలల్లో ఏడింటికి ఈ సౌకర్యాలు లేవని పేర్కొంది. విద్యార్థులకు చేతులు శుభ్రపరుచుకోవటం, సురక్షిత తాగునీటిని అందించటం వంటి సౌకర్యాలు కల్పించాలని యాస్మిన్​ కోరారు.

ఇదీ చదవండి: ఆ బ్లడ్​గ్రూప్​ వారికి కరోనా సోకే అవకాశం తక్కువే!

భారత దేశంలోని పట్టణాల్లో నివసించేవారిలో సుమారు 9కోట్ల మందికి.. ఇళ్లల్లో చేతులు శుభ్రపరుచుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని యూనిసెఫ్ పేర్కొంది​. ఈ మేరకు 'అంతర్జాతీయ హ్యాండ్‌ వాష్‌ డే' సందర్భంగా.. విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కరోనా వేళ ఈ సమస్య మరింత పెరిగిందని తెలిపింది.

22శాతం మందికి..

మధ్య, దక్షిణ ఆసియా పట్టణాల్లో నివసించే 22శాతం మంది ప్రజలకు చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీరు వంటి సదుపాయాలు అందుబాటులో లేవని యూనిసెఫ్​ నివేదిక స్పష్టం చేసింది. బంగ్లాదేశ్​లో సుమారు 2కోట్ల 90లక్షల మంది పట్టణ ప్రజలు కూడా ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరుచుకోవటం గుర్తుంచుకోవాలని, ఇది సామాజిక బాధ్యతని యూనెసెఫ్‌ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్‌ యాస్మిన్‌ ఆలీ హక్‌ అన్నారు. లేని పక్షంలో కొవిడ్​ మరింత విజృంభిస్తుందని ఆయన హెచ్చరించారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కరోనాలాంటి మరెన్ని వైరస్​లను అడ్డుకోవచ్చని గుర్తుచేశారు యాస్మిన్​.

ఐదుగురిలో ముగ్గురికే..

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో ముగ్గురికి మాత్రమే చేతులు శుభ్రపరుచుకునే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని.. పిల్లల హక్కుల నివేదిక వెల్లడిస్తోందని యూనెసెఫ్‌ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ 10 పాఠశాలల్లో ఏడింటికి ఈ సౌకర్యాలు లేవని పేర్కొంది. విద్యార్థులకు చేతులు శుభ్రపరుచుకోవటం, సురక్షిత తాగునీటిని అందించటం వంటి సౌకర్యాలు కల్పించాలని యాస్మిన్​ కోరారు.

ఇదీ చదవండి: ఆ బ్లడ్​గ్రూప్​ వారికి కరోనా సోకే అవకాశం తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.