ఆసియాలోని కొన్ని దేశాల్లో భూకంపం సంభవించింది. ఇండోనేసియాలో మధ్యస్థాయి తీవ్రతతో భూమి కంపించగా... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈ మేరకు ఐరోపా-మధ్యధార భూకంపం కేంద్రం తెలిపింది. సింగపూర్లో కూడా 6.1 తీవ్రతతో భూమి కంపించింది.
తజికిస్థాన్, అఫ్గానిస్థాన్లోనూ స్వల్పంగా భూకంపనాలు ఏర్పడ్డాయి. తజికిస్థాన్ దుషన్బేలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు కాగా... అఫ్గానిస్థాన్ కాబూల్లో 4.7 తీవ్రతతో భూ కంపనాలు ఏర్పడ్డాయి. అయితే దీని వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆయా దేశాల అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'చైనా వెనక్కి తగ్గినా.. భారత్ అప్రమత్తంగానే ఉండాలి'