ETV Bharat / international

ఆ భయంతో 48 మంది వైద్యుల రాజీనామా!

author img

By

Published : Jul 6, 2020, 5:59 AM IST

పాకిస్థాన్​లో కరోనాపై ముందుండి పోరాటం చేస్తోన్న వైద్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైరస్​ నుంచి తమను తాము రక్షించుకునేందుకు సరైన రక్షణ కిట్లు, సామగ్రి అందించటం లేదని నిరసనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పంజాబ్​ రాష్ట్రంలో 48 మంది యువ వైద్యులు రాజీనామా చేయటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

48 doctors resign over inadequacy of safety gear to protect them from coronavirus in Pak
ఆ భయంతో 48 మంది వైద్యుల రాజీనామా!

కరోనాపై పోరులో పాకిస్థాన్​ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైరస్​ను కట్టడి చేయటంలో ముందుడే వైద్యులకే సరైన రక్షణ కల్పించటం లేదనే కారణంతో పంజాబ్​ రాష్ట్రంలోని బోధనా ఆస్పత్రులకు చెందిన 48 మంది డాక్టర్లు రాజీనామా చేశారు.

48 మంది యువ వైద్యుల రాజీనామాలు ఆమోదించినట్లు నోటిఫికేషన్​ జారీ చేసింది పంజాబ్​ ఆరోగ్య శాఖ.

"కరోనా నుంచి రక్షించుకునేందుకు తమకు తగిన రక్షణ సౌకర్యాలు కల్పించాలని పలు మార్లు కోరినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే వైద్యులు రాజీనామా చేశారు. వైద్య సిబ్బంది భద్రత పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. కొవిడ్​-19పై మేము ముందుండి పోరాడుతున్నాం. మాకు ఇమ్రాన్​ ప్రభుత్వం ఏమి చేసిందో కనిపిస్తూనే ఉంది. జీతాలు, వ్యక్తిగత భద్రత కిట్లు అందించాలని నిరసన తెలిపినందుకు కొన్ని రోజుల క్రితం ముజఫరాబాద్​(పీఓకే)లో వైద్యులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. 23 మంది యువ వైద్యులను అరెస్ట్ చేసిన క్రమంలో పీఓకేలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను నిలిపివేశారు."

- సీనియర్​ వైద్యుడు, పంజాబ్​

ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే మరింత మంది వైద్యులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు. అయితే.. ప్రభుత్వం వైద్యులకు, సిబ్బందికి అన్ని రకాల భద్రత కిట్లు అందించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. యాస్మిన్​ రషీద్​ తెలిపారు.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 5,000 మంది ఆరోగ్య నిపుణులు వైరస్​ బారిన పడ్డారు. అందులో 3వేల మంది డాక్టర్లు, 600 మంది నర్సులు ఉన్నారు. మొత్తం 70 మంది వైద్యులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అందులో 35 మంది వైద్యులు పంజాబ్​ వారే ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి: మంచుపై సర్రున జారుతూ స్కీయింగ్​.!

కరోనాపై పోరులో పాకిస్థాన్​ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైరస్​ను కట్టడి చేయటంలో ముందుడే వైద్యులకే సరైన రక్షణ కల్పించటం లేదనే కారణంతో పంజాబ్​ రాష్ట్రంలోని బోధనా ఆస్పత్రులకు చెందిన 48 మంది డాక్టర్లు రాజీనామా చేశారు.

48 మంది యువ వైద్యుల రాజీనామాలు ఆమోదించినట్లు నోటిఫికేషన్​ జారీ చేసింది పంజాబ్​ ఆరోగ్య శాఖ.

"కరోనా నుంచి రక్షించుకునేందుకు తమకు తగిన రక్షణ సౌకర్యాలు కల్పించాలని పలు మార్లు కోరినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే వైద్యులు రాజీనామా చేశారు. వైద్య సిబ్బంది భద్రత పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. కొవిడ్​-19పై మేము ముందుండి పోరాడుతున్నాం. మాకు ఇమ్రాన్​ ప్రభుత్వం ఏమి చేసిందో కనిపిస్తూనే ఉంది. జీతాలు, వ్యక్తిగత భద్రత కిట్లు అందించాలని నిరసన తెలిపినందుకు కొన్ని రోజుల క్రితం ముజఫరాబాద్​(పీఓకే)లో వైద్యులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. 23 మంది యువ వైద్యులను అరెస్ట్ చేసిన క్రమంలో పీఓకేలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను నిలిపివేశారు."

- సీనియర్​ వైద్యుడు, పంజాబ్​

ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే మరింత మంది వైద్యులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు. అయితే.. ప్రభుత్వం వైద్యులకు, సిబ్బందికి అన్ని రకాల భద్రత కిట్లు అందించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. యాస్మిన్​ రషీద్​ తెలిపారు.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 5,000 మంది ఆరోగ్య నిపుణులు వైరస్​ బారిన పడ్డారు. అందులో 3వేల మంది డాక్టర్లు, 600 మంది నర్సులు ఉన్నారు. మొత్తం 70 మంది వైద్యులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అందులో 35 మంది వైద్యులు పంజాబ్​ వారే ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి: మంచుపై సర్రున జారుతూ స్కీయింగ్​.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.