ETV Bharat / international

7 రోజుల్లో 291 మంది అఫ్గాన్​ సైనికులు మృతి

author img

By

Published : Jun 22, 2020, 5:25 PM IST

అఫ్గానిస్థాన్​లో గతవారం జరిగిన తాలిబన్​ దాడుల్లో భారీ సంఖ్యలో సైనికులు మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటించింది. 2001లో అమెరికా చేసిన దాడి తర్వాత ఎన్నడూలేని విధంగా అధిక సంఖ్యలో అఫ్గాన్ ​భద్రత బలగాలు ప్రాణాలు కోల్పోయాయని అధికారులు వెల్లడించారు.

291 Afghan soldiers dead in Taliban attacks: Govt
వారంలో 291 మంది అఫ్గాన్​ సైనికులు మృతి!

తాలిబన్ల దాడులతో అట్టుడుకుతోంది అఫ్గానిస్థాన్​. గత వారంలో తాలిబన్​ దాడుల్లో సుమారు 291 మంది​ సైనికులు మృతి చెందగా... 550 మందికి గాయలయ్యాయని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గాన్​పై 2001లో అమెరికా దాడి తర్వాత అత్యధికంగా భద్రత బలగాలు మరణించడం ఇదే తొలిసారి అని తెలిపింది. తాలిబన్లు, అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం... అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్లు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో హింస చెలరేగడం చర్చనీయాంశమైంది.

"దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా... 32 రాష్ట్రాల్లో 422 సార్లు తాలిబన్లు గతవారంలో దాడి చేశారు. ఈ దాడుల్లో 291 మంది అఫ్గాన్​ జాతీయ రక్షణ, భద్రత దళాల (ఏఎన్​డీఎస్​ఎఫ్​) సభ్యులు మరణించగా... 550 మంది క్షతగాత్రులయ్యారు."

-జావీద్​ ఫైజల్​, జాతీయ భద్రత మండలి (ఎన్​ఎస్​సీ) ప్రతినిధి

గత 19 ఏళ్లల్లో ఎప్పుడూ జరగని విధంగా హంసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వల్ల భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయని ఎన్​ఎస్​సీ అధికారులు మరో ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఈ దాడుల్లో 42 మంది పౌరులు చనిపోగా.. మరో 100మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు.

ఆ ప్రకటన అవాస్తవం..

ప్రభుత్వం ప్రకటించినట్లు గతవారం అధిక సంఖ్యలో దాడులు జరగలేదని... సమస్య మరింత జటిలం చేయడానికే క్షతగాత్రుల సంఖ్యను 50 నుంచి 500 పెంచి చెబుతున్నారని విమర్శించారు తాలిబన్​ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్​. హింసాత్మక ఘటనలు జరిగాయని... కానీ భద్రత దళాల నుంచి రక్షణ కోసమే దాడులు చేశామన్నారు ముజాహిద్​.

ఇదీ చూడండి: జవాన్ల మృతిపై మళ్లీ జవాబు దాటవేసిన చైనా

తాలిబన్ల దాడులతో అట్టుడుకుతోంది అఫ్గానిస్థాన్​. గత వారంలో తాలిబన్​ దాడుల్లో సుమారు 291 మంది​ సైనికులు మృతి చెందగా... 550 మందికి గాయలయ్యాయని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గాన్​పై 2001లో అమెరికా దాడి తర్వాత అత్యధికంగా భద్రత బలగాలు మరణించడం ఇదే తొలిసారి అని తెలిపింది. తాలిబన్లు, అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం... అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్లు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో హింస చెలరేగడం చర్చనీయాంశమైంది.

"దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా... 32 రాష్ట్రాల్లో 422 సార్లు తాలిబన్లు గతవారంలో దాడి చేశారు. ఈ దాడుల్లో 291 మంది అఫ్గాన్​ జాతీయ రక్షణ, భద్రత దళాల (ఏఎన్​డీఎస్​ఎఫ్​) సభ్యులు మరణించగా... 550 మంది క్షతగాత్రులయ్యారు."

-జావీద్​ ఫైజల్​, జాతీయ భద్రత మండలి (ఎన్​ఎస్​సీ) ప్రతినిధి

గత 19 ఏళ్లల్లో ఎప్పుడూ జరగని విధంగా హంసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వల్ల భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయని ఎన్​ఎస్​సీ అధికారులు మరో ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఈ దాడుల్లో 42 మంది పౌరులు చనిపోగా.. మరో 100మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు.

ఆ ప్రకటన అవాస్తవం..

ప్రభుత్వం ప్రకటించినట్లు గతవారం అధిక సంఖ్యలో దాడులు జరగలేదని... సమస్య మరింత జటిలం చేయడానికే క్షతగాత్రుల సంఖ్యను 50 నుంచి 500 పెంచి చెబుతున్నారని విమర్శించారు తాలిబన్​ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్​. హింసాత్మక ఘటనలు జరిగాయని... కానీ భద్రత దళాల నుంచి రక్షణ కోసమే దాడులు చేశామన్నారు ముజాహిద్​.

ఇదీ చూడండి: జవాన్ల మృతిపై మళ్లీ జవాబు దాటవేసిన చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.