అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష భవనంలోని 20 మంది సిబ్బందికి కరోనా సోకింది. అయితే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి మాత్రం వైరస్ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 20 మంది కొవిడ్ బారిన పడడం వల్ల... ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయాన్ని మూసివేసినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. ఈ 20 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు పేర్కొన్న ఇంకో అధికారి.. పాలనా విభాగంలోని మరో 12 మందికీ వైరస్ సోకిందని తెలిపారు.
కరోనా కారణంగా ఇప్పటికే దేశ రాజధాని కాబూల్ లాక్డౌన్లో ఉంది. వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోన్న తరుణంలో ఇటీవలే లాక్డౌన్ను మరో 3 వారాలు పొడిగించారు.
కొవిడ్-19 ధాటికి అఫ్ఘాన్లో ఇప్పటివరకు 33 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 933 మంది ఈ మహమ్మారి బారినపడ్డారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టెస్టులు పరిమితంగా జరుగుతున్నందున.. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: 80 ఆస్పత్రులు తిరిగినా ఆ రోగికి నో ఎంట్రీ!