ETV Bharat / international

వందేళ్ల క్రితం ఫ్లూతో ఒకరు.. ఇప్పుడు కరోనాతో మరొకరు

అమెరికాలోని ఇద్దరు కవలలు... వైరస్ మహమ్మారులకే బలయ్యారు. అయితే వందేళ్ల క్రితం స్పానిష్​ ఫ్లూ సోకి ఆ కవలల్లో ఒకరు మృతి చెందగా, తాజాగా కరోనాతో మరొకరు మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి.. వందేళ్ల వయసులో ఇప్పుడు కరోనాతో పోరాడి మరణించాడు.

author img

By

Published : Apr 24, 2020, 6:45 AM IST

Virus kills WWII veteran 100 years after twin died of Spanish flu
వందేళ్ల క్రితం ఒకరు.. ఇప్పుడు మరొకరు

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికా మాజీ సైనికుడు ఫిలిప్ కాన్​.. కరోనా మహమ్మారి సోకి మరణించాడు. ఐవో జిమా యుద్ధం, హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన తర్వాత ఏరియల్ సర్వేలకు ఈయన సహకారం అందించాడు.

అయితే.. 1918-19 మధ్య కాలంలో విజృంభించిన స్పానిష్​ ఫ్లూతో అతని కవల సోదరుడు శామ్యూల్​ మరణించాడు. యాదృచ్ఛికమే అయినా వందేళ్ల వ్యవధిలో కవలలు రెండు వేర్వేరు మహమ్మారులతో ప్రాణాలు కోల్పోయారు.

ఫిలిప్​​, శామ్యూల్​ 1919 డిసెంబర్​లో జన్మించారు. అప్పటికే విజృంభించిన స్పానిష్​ ఫ్లూతో వారిలో ఒకరైన శామ్యూల్​ మరణించాడు. అయితే ఫిలిప్​ తన జీవిత కాలంలో ఇలాంటి వైరస్​ వస్తుందని భయపడినట్లు అతని మనవుడు వారెన్ జిస్మాన్ తెలిపాడు.

" నేను తాతగారితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఆయన చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని చెప్పారు. వారు పుట్టిన ఏడాది వ్యాప్తి చెందిన వైరస్​ మళ్లీ వందేళ్లకు వస్తుందన్నారు. ఈనెల 17న తాతగారు మరణించేందుకు ముందు దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా తాతగారు వారి సోదరుడి గురించి ప్రస్తావించారు."

-- వారెన్ జిస్మాన్, ఫిలిప్​​ మనవడు

ఫిలిప్​ 1940లో అమెరికా సైన్యంలో పైలట్​గా శిక్షణలో చేరారు. అమెరికా సైన్యంలో ఆయన సేవలకు గాను రెండు కాంస్య స్టార్​లు లభించాయి. 2017లో తన 98వ పుట్టినరోజు సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన యుద్ధం చాలా భయంకరమైనదని గుర్తుచేసుకున్నారు. యుద్ధం వల్ల ఎంతో మంది సైనికులు మృతిచెందగా, చాలా మంది పౌరులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

వందేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన స్పానిష్​ ఫ్లూ వల్ల 5 కోట్ల మంది బాధితులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఇదీ చదవండి: కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికా మాజీ సైనికుడు ఫిలిప్ కాన్​.. కరోనా మహమ్మారి సోకి మరణించాడు. ఐవో జిమా యుద్ధం, హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన తర్వాత ఏరియల్ సర్వేలకు ఈయన సహకారం అందించాడు.

అయితే.. 1918-19 మధ్య కాలంలో విజృంభించిన స్పానిష్​ ఫ్లూతో అతని కవల సోదరుడు శామ్యూల్​ మరణించాడు. యాదృచ్ఛికమే అయినా వందేళ్ల వ్యవధిలో కవలలు రెండు వేర్వేరు మహమ్మారులతో ప్రాణాలు కోల్పోయారు.

ఫిలిప్​​, శామ్యూల్​ 1919 డిసెంబర్​లో జన్మించారు. అప్పటికే విజృంభించిన స్పానిష్​ ఫ్లూతో వారిలో ఒకరైన శామ్యూల్​ మరణించాడు. అయితే ఫిలిప్​ తన జీవిత కాలంలో ఇలాంటి వైరస్​ వస్తుందని భయపడినట్లు అతని మనవుడు వారెన్ జిస్మాన్ తెలిపాడు.

" నేను తాతగారితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఆయన చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని చెప్పారు. వారు పుట్టిన ఏడాది వ్యాప్తి చెందిన వైరస్​ మళ్లీ వందేళ్లకు వస్తుందన్నారు. ఈనెల 17న తాతగారు మరణించేందుకు ముందు దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా తాతగారు వారి సోదరుడి గురించి ప్రస్తావించారు."

-- వారెన్ జిస్మాన్, ఫిలిప్​​ మనవడు

ఫిలిప్​ 1940లో అమెరికా సైన్యంలో పైలట్​గా శిక్షణలో చేరారు. అమెరికా సైన్యంలో ఆయన సేవలకు గాను రెండు కాంస్య స్టార్​లు లభించాయి. 2017లో తన 98వ పుట్టినరోజు సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన యుద్ధం చాలా భయంకరమైనదని గుర్తుచేసుకున్నారు. యుద్ధం వల్ల ఎంతో మంది సైనికులు మృతిచెందగా, చాలా మంది పౌరులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

వందేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన స్పానిష్​ ఫ్లూ వల్ల 5 కోట్ల మంది బాధితులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఇదీ చదవండి: కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.