అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించేందుకు.. కీలక పాత్ర పోషించిన ప్రవాస భారతీయులు 'సౌత్ ఏషియన్ ఫర్ అమెరికా' (ఎస్ఏఎఫ్ఏ) అనే సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో రాజకీయ సాధికారత సాధించే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మే 6న లాంఛనంగా ఏర్పాటు చేయనున్నామని స్పష్టం చేశారు.
సౌత్ ఏషియా ఫర్ బైడెన్(ఎస్ఏబీ) అనే సంస్థ బైడెన్ గెలుపులో కొంత పాత్ర పోషించింది. ఇదే ఇప్పుడు ;సాఫా'కు శ్రీకారం చుట్టనుంది. అమెరికాలో దక్షిణాసియా ప్రజల రాజకీయ భాగస్వామ్యం పెంచేలా ఈ సంస్థ కృషి చేయనుంది. దక్షిణాసియా ప్రజల ఓటింగ్ సామర్థ్యం, ఐక్యతపై ప్రధానంగా దృష్టి సారించనుంది. మే 6న జరగనున్న కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణ మూర్తి, వర్జీనియా స్టేట్ సెనేటర్ ఘజాలా హశ్మీ తదితరులు పాల్గొననున్నారు.
"ఎస్ఏఎఫ్ఏ స్థాపించడం ఆనందాన్ని కలిగించింది. 2020 ఎన్నికల్లో ఎస్ఏబీ ఆవశ్యకత.. భవిష్యత్తులో దక్షిణాసియా ప్రజల రాజకీయ సాధికారత ప్రాముఖ్యాన్ని గుర్తుచేసింది. కేవలం ఎన్నికల వరకే ఈ ఐక్యత పరిమితం కాకూడదు."
-నేహా డివాన్, ఎస్ఏబీ నేషనల్ డైరెక్టర్
ఇదీ చదవండి: సీరం సంస్థ వినతిపై అమెరికా మౌనం
ఇదీ చదవండి: అత్యవసరమైతేనే భారత్కు వెళ్లండి: అమెరికా