ధనిక దేశాలు తమ పౌరులకు కరోనా వ్యాక్సిన్ను అందించడంతో.. ప్రపంచంలో అందరికీ టీకా అందుబాటులో ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నొక్కిచెప్పారు. జర్మనీ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఫైజర్ సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆ దేశ శాస్త్రవేత్తలను పొగిడారు.
"జర్మన్ శాస్త్రవేత్తల విజయాలు గర్వంచదగ్గవి. ప్రపంచంలో అందరికి వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచడమే మన ధ్యేయం.ఇది ప్రజల వాక్సిన్."
-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో శాస్త్రీయ నమ్మకం కలిగేలా ఐరాస చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని గుటెరస్ అన్నారు. సైన్స్పై ప్రజల్లో అపనమ్మకం కలిగించే ప్రజాదరణ పొందిన విధానాలను ప్రపంచం చూసిందని ఆయన అన్నారు. మహమ్మారి కాలంలో దేశాన్ని నడిపించడంలో జర్మనీ ఛాన్స్లర్ విజయం సాధించారని కొనియాడారు.