ETV Bharat / international

ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య బైడెన్​ ప్రమాణస్వీకారం!

author img

By

Published : Jan 12, 2021, 9:10 AM IST

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణస్వీకారం ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య జరగనుంది. ఈ నెల 24 వరకు దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యవసర పరిస్థితి విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Trump issues emergency declaration for inaugural
ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య బైడెన్​ ప్రమాణస్వీకారం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్ ​డీసీలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా ఎన్నికైన జో బైడెన్​ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. స్థానికంగా పెరుగుతోన్న హింసను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాల వెల్లడించాయి. ఈ ఆదేశాలు జనవరి 24 వరకు అమలులో ఉంటాయి.

ఈ నిర్ణయంతో హోంశాఖ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ ఏజెన్సీలు.. స్థానిక అధికారులు కలిసి సమన్వయంతో పని చేయనున్నాయి. క్యాపిటల్​ వద్ద గురువారం జరిగిన అల్లర్లలో అయిదుగురు మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి ట్రంప్​ ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. కానీ వాటిని అధికారుల ఇప్పటికే ఖండించారు.

నగరంలో జరుగుతున్న ఆందోళనలతో పాటు కొవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ప్రమాణస్వీకారానికి రావొద్దని కొలంబియా, వర్జీనియా గవర్నర్లు కోరారు.

ఇదీ చూడండి: ట్రంప్​పై అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్ ​డీసీలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా ఎన్నికైన జో బైడెన్​ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. స్థానికంగా పెరుగుతోన్న హింసను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాల వెల్లడించాయి. ఈ ఆదేశాలు జనవరి 24 వరకు అమలులో ఉంటాయి.

ఈ నిర్ణయంతో హోంశాఖ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ ఏజెన్సీలు.. స్థానిక అధికారులు కలిసి సమన్వయంతో పని చేయనున్నాయి. క్యాపిటల్​ వద్ద గురువారం జరిగిన అల్లర్లలో అయిదుగురు మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి ట్రంప్​ ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. కానీ వాటిని అధికారుల ఇప్పటికే ఖండించారు.

నగరంలో జరుగుతున్న ఆందోళనలతో పాటు కొవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ప్రమాణస్వీకారానికి రావొద్దని కొలంబియా, వర్జీనియా గవర్నర్లు కోరారు.

ఇదీ చూడండి: ట్రంప్​పై అభిశంసన తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.