ETV Bharat / international

'ఫలితాలు మార్చేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు'

author img

By

Published : Nov 20, 2020, 5:27 PM IST

అమెరికా ఎన్నికల ఫలితాలను మార్చేందుకు అధ్యక్షుడు ట్రంప్.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి తేవటం, రాష్ట్ర చట్టసభ్యులకు సమన్లు జారీ చేయటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇలాంటి చర్యలతో అమెరికా ఎన్నికలపై విశ్వాసం పోతుందని హెచ్చరించారు.

Trump
ట్రంప్

అమెరికా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో పాటు ఆయన మద్దతుదారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. జో బైడెన్​కు అధికారం అందనీయకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్ర చట్టసభ్యులకు కూడా శ్వేతసౌధం నుంచి సమన్లు జారీ చేస్తున్నారు. వీటితోపాటు స్థానిక ఎన్నికల అధికారులను వ్యక్తిగతంగా పిలవటం, ఓట్ల లెక్కింపును ఆలస్యం చేయాలని కౌంటీ అధికారులను ఆదేశించటం.. ఇలా అనేక మార్గాల్లో ఒత్తిడి తేవటం ఆ కోవలోనికే వస్తాయని నిపుణులు అంటున్నారు.

అధికారులు చెబుతున్నా..

అదే సమయంలో ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా చరిత్రలో 2020 ఎన్నికలే అత్యంత సురక్షితమైనవని చెప్పిన ఉన్నతాధికారిపై ట్రంప్ వేటువేశారు.

ఓటమిని అంగీకరించాల్సిందే..

అయితే, ఇలాంటి ప్రయత్నాలను చాలా మంది తప్పుబడుతున్నారు. ఓటమిని చట్టబద్ధంగా అంగీకరించేందుకు రిపబ్లికన్లు వెనకాడటం ఆందోళనకరమైన విషయమని కెంటక్కీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జోషువా డగ్లస్ అన్నారు.

"ప్రజాస్వామ్య నిబంధనలకు కట్టుబడి.. ఓటమిని అంగీకరించాలి. కానీ, ఇది ఇక్కడ జరగట్లేదు. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా ఎన్నికల సమగ్రతకు నష్టం కలిగిస్తాయి."

- జోషువా డగ్లస్

ఇదీ చూడండి: జార్జియా రీకౌంటింగ్​లో బైడెన్​ ఘనవిజయం

అమెరికా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో పాటు ఆయన మద్దతుదారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. జో బైడెన్​కు అధికారం అందనీయకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్ర చట్టసభ్యులకు కూడా శ్వేతసౌధం నుంచి సమన్లు జారీ చేస్తున్నారు. వీటితోపాటు స్థానిక ఎన్నికల అధికారులను వ్యక్తిగతంగా పిలవటం, ఓట్ల లెక్కింపును ఆలస్యం చేయాలని కౌంటీ అధికారులను ఆదేశించటం.. ఇలా అనేక మార్గాల్లో ఒత్తిడి తేవటం ఆ కోవలోనికే వస్తాయని నిపుణులు అంటున్నారు.

అధికారులు చెబుతున్నా..

అదే సమయంలో ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా చరిత్రలో 2020 ఎన్నికలే అత్యంత సురక్షితమైనవని చెప్పిన ఉన్నతాధికారిపై ట్రంప్ వేటువేశారు.

ఓటమిని అంగీకరించాల్సిందే..

అయితే, ఇలాంటి ప్రయత్నాలను చాలా మంది తప్పుబడుతున్నారు. ఓటమిని చట్టబద్ధంగా అంగీకరించేందుకు రిపబ్లికన్లు వెనకాడటం ఆందోళనకరమైన విషయమని కెంటక్కీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జోషువా డగ్లస్ అన్నారు.

"ప్రజాస్వామ్య నిబంధనలకు కట్టుబడి.. ఓటమిని అంగీకరించాలి. కానీ, ఇది ఇక్కడ జరగట్లేదు. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా ఎన్నికల సమగ్రతకు నష్టం కలిగిస్తాయి."

- జోషువా డగ్లస్

ఇదీ చూడండి: జార్జియా రీకౌంటింగ్​లో బైడెన్​ ఘనవిజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.