Omicron travel restrictions USA: నూతన సంవత్సరం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.
కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ను కట్టిడి చేసే చర్యల్లో భాగంగా గత నెల ఆయా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది అమెరికా. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఈస్వతిని, మొజాంబిక్, మాలావి దేశాలను ఇటీవల సందర్శించిన అమెరికాయేతరులను నవంబర్ 29 నుంచి దేశంలోకి నిషేధించింది. 'వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. తాత్కాలిక ప్రయాణ ఆంక్షలతో కొత్త వేరియంట్ను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు సమయం దొరుకుతుంది. అలాగే.. ప్రస్తుత వ్యాక్సిన్లు కొత్త వేరియంట్పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? అని తెలుసుకునే వీలు ఉంటుంది.' అని ట్విట్టర్ ద్వారా తెలిపారు శ్వేతసౌదం ప్రతినిధి కెవిన్ మునోజ్.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారితో సహా దేశం మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు అత్యధికంగా వ్యాక్సిన్ తీసుకోనివారేనని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:
కరోనాతో అగ్రరాజ్యం విలవిల.. ఒక్కరోజే 1.81 లక్షల కేసులు
ప్రపంచాన్ని చుట్టేస్తున్న 'ఒమిక్రాన్'- మరిన్ని దేశాల్లో ఆంక్షలు