అమెరికా సెంట్రల్ న్యూయార్క్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 57 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా నయగార జలపాతాన్ని చూడడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగే సమయానికి బస్సులో మొత్తం 57 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్న, పెద్ద గాయాలు అయిన వారందరిని ఆసుపత్రికు తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి: హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!