ETV Bharat / international

అమెరికాలో రెండు విమానాలు ఢీ.. 8మంది మృతి - america plane crash

అగ్రరాజ్యం అమెరికాలోని ఉత్తర ఇదాహోలో రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. అనంతరం చెరువులో కూలిపోయాయి. ఈ ఘటనలో 8మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు.

Sheriff: At least 8 killed in plane collision at Idaho lake
అమెరికాలో రెండు విమానాలు ఢీ.. 8మంది మృతి
author img

By

Published : Jul 7, 2020, 8:00 AM IST

అమెరికాలోని ఉత్తర ఇదాహోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ చెరువుపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు కూటినై కౌంటీ అధికారి తెలిపారు.

రెండు విమానాల్లో ఒకటి ఫ్లోట్​ ప్లేన్​. ఇది కౌర్​ డి అలేనేకు చెందిన బ్రూక్స్​ సీప్లేన్స్​ సంస్థకు చెందింది. ఇందులో పైలట్​, ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మరొక విమానం సెస్నా 206.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో.. ఆకాశంలో రెండు విమానాలు ఒకదానిని మరొకటి ఢీకొని.. అనంతరం వందల మీటర్ల ఎత్తు నుంచి చెరువులోకి పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

అమెరికాలోని ఉత్తర ఇదాహోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ చెరువుపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు కూటినై కౌంటీ అధికారి తెలిపారు.

రెండు విమానాల్లో ఒకటి ఫ్లోట్​ ప్లేన్​. ఇది కౌర్​ డి అలేనేకు చెందిన బ్రూక్స్​ సీప్లేన్స్​ సంస్థకు చెందింది. ఇందులో పైలట్​, ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మరొక విమానం సెస్నా 206.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో.. ఆకాశంలో రెండు విమానాలు ఒకదానిని మరొకటి ఢీకొని.. అనంతరం వందల మీటర్ల ఎత్తు నుంచి చెరువులోకి పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.